బాలీవుడ్లో తెరకెక్కుతోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో ‘బ్రహ్మాస్త్ర’ ఒకటి.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్, ఆలియా భట్లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమాను ఒకేసారి మూడు పార్టులుగా సోషియో ఫాంటసీ కథాంశంతో హాలీవుడ్ స్టైల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగోను తాజాగా విడుదల చేశారు. ఈ టైటిల్ లోగోలో రణ్వీర్ కపూర్..అమితాబ్ బచ్చన్ను అడుగుతూ అంటాడు. ప్రపంచంలో ఏదైనా ఒక అస్త్రం ఉన్నాదా... అది కలిపితే గుండ్రంగా ఉంటుంది. దానిపై ఒక గుర్తు కూడా ఉంది అంటూ రణ్వీర్ కపూర్ అడుగుతుంటాడు. దానికి అమితాబ్ అదే మొత్తం బ్రహ్మాండంలో ఉన్న శక్తి అంతా నింపుకున్న అద్వితీయ అస్త్రం బ్రహ్మాస్త్రం అని చెబుతాడు. ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్ లోగోను ఈ సినిమాలో నటించే అమితాబ్,రణ్బీర్, ఆలియాల వాయిస్తో రిలీజ్ చేసారు.
బ్రహ్మాస్త్రం మూడు భాగాలుగా చూపించనట్టు ఈ సినిమాను కూడా మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి టైటిల్ లోగోతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మూవీ మేకర్స్ సినిమాతో ఎలాంట సంచనాలు నమోదు చేస్తారో చూడాలి. ఈ టైటిల్ లోగోను 150 డ్రోన్ కెమెరాలతో ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో ఆవిష్కరించారు.

బ్రహ్మాస్త్ర టైటిల్ లోగో
అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను క్రిస్మస్ కానుగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్...నమిత్ మల్హోత్రకు చెందిన ఫాక్స్ స్టార్ స్టూడియోళ్లతో కలిసి తెరకెక్కిస్తున్నాడు.