అమితాబ్ బచ్చన్ తాను చెప్పినట్టుగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వివారల్లోకి వెళితే.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ నివారణ కోసం దేశ వ్యాప్త లాక్డైన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేయడంలో నిమగ్నమయ్యాయి. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు ఇప్పటికే దేశ ప్రజలు చప్పట్లతో పాటు... దీపాలు వెలిగించి కరోనా పై పోరులో దేశ ప్రజలంతా ఒక్కటే అని నిరూపించారు. మరోవైపు కరోనా పై పోరులో సినీ నటులు కూడా దేశానికి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే కరోనాపై పోరాటంలో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్.. లాక్డౌన్ కారణంగా పని లేకుండా పోయిన లక్ష మంది ప్రజలకు ఒక నెలకు సంబంధించిన నిత్యావసరాలు అందించేందుకు ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫిడరేషన్తో కలిసి ముందుకు వచ్చారు.
తాజాగా ఆయన ఉత్తర ముంబైలోని స్లమ్ ఏరియాల్లో ఉంటున్న పేదలకు రెండు వేల ఆహార పొట్లాలను పంచారు. అలాగే మూడు వేల మందికి ఒక నెలకు సరిపడా నిత్యావసరాలు అందజేసారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్లో పేర్కొన్నారు. అంతేకాదు త్వరలో ఇంట్లో నలుగురు సభ్యులు చొప్పున నాలుగు లక్షల మందిని నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను ఇవ్వాలనేది నా ప్రయత్నం అంటూ అమితాబ్ వెల్లడించారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమితాబ్ బచ్చన్ ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫిడరేషన్తో పాటు సోనీ పిక్చర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ సంస్థలతో కలిసి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Bollywood, Coronavirus, Covid-19, Tollywood