హోమ్ /వార్తలు /సినిమా /

Balagam: ‘బలగం’ మూవీకి మరో అరుదైన గౌరవం.. ఉత్తమ చిత్రంగా ఉగాది నంది పురస్కారం..

Balagam: ‘బలగం’ మూవీకి మరో అరుదైన గౌరవం.. ఉత్తమ చిత్రంగా ఉగాది నంది పురస్కారం..

ఉగాది ‘నంది’ పురస్కారాల్లో ‘బలగం’ మూవీ సత్తా (Twitter/Photo)

ఉగాది ‘నంది’ పురస్కారాల్లో ‘బలగం’ మూవీ సత్తా (Twitter/Photo)

Balagam: చిన్న సినిమాగా విడుదలైన ‘బలగం’ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. జబర్ధస్త్ నటుడు వేణు టిల్లు డైరెక్షన్‌ దర్శకత్వంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించిన సినిమా ‘బలగం’. తాజాగా ఈ సినిమా ఉగాది పురస్కారాల్లో సత్తా చాటింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Balagam: చిన్న సినిమాగా విడుదలైన ‘బలగం’ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. జబర్ధస్త్ నటుడు వేణు టిల్లు డైరెక్షన్‌ దర్శకత్వంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించిన సినిమా ‘బలగం’. దిల్ రాజు సమర్ఫణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ప్రొడ్యూస్ చేసారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన హిట్ సొంతం చేసుకుంది. మల్లేశం తర్వాత హీరోగా ప్రియదర్శికి ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రియదర్శిలో మంచి కమెడియన్‌ కాకుండా.. మంచి నటుడు ఉన్న విషయం మల్లేశం మూవీతోనే ఇది వరకు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో మధ్య తరగతి తెలంగాణ యువకుడి పాత్రలో తన పరధి మేరకు రాణించాడు. ప్రియదర్శి తాత పాత్రలో నటించిన సుధాకర్ రెడ్డి తన  పాత్రలో జీవించాడు. కావ్యా కళ్యాణ్ రామ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలోని మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నేటితో మూడు వారాలు పూర్తి చేసుకుటోంది. తాజాగా  ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగు కొత్త సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సరం పురస్కరించుకొని  తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో ‘బలగం’ చిత్ర యూనిట్ ను ఉగాది నంది సత్కారం తో సత్కరించారు. బలగం చిత్ర నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హర్షిత, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ మరియు ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆర్ నారాయణ మూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు నంది పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

ఎల్ వీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన ఈ వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు కాదంబరి కిరణ్, రామ్ రావిపల్లి, రవికాంత్, నిర్మాతలు కూనిరెడ్డి శ్రీనివాస్, మోహన్ గౌడ్, గల్ఫ్ వాసు, అని ప్రసాద్, ప్రవీణ నాయుడు మరియు వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న పలువురిని ఉగాదినంది పురస్కారంతో సత్కరించారు.ఉగాది రోజు టీం మొత్తాన్ని ఘనంగా సత్కరించిన తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు విజయ్ వర్మ పాకలపాటికి నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత, నటీనటులు సాంకేతిక నిపుణులు కృతఙ్ఞతలు తెలియజేసారు. "బలగం" లాంటి చిత్రాలు మరిన్ని రావాలని ఇదొక దృశ్య కావ్యం అని ఆర్ నారాయణమూర్తి, రుద్రరాజు పద్మ రాజు కొనియాడారు. మంచి సాంప్రదాయానికి తెరదీసిన తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు వర్మ పాకలపాటి, ఉపాధ్యక్షులు మిమిక్రీ రమేష్ కి అభినందనలు తెలిపారు. త్వరలో "సింహ" పేరుతొ తెలంగాణ ప్రభుత్వం తరపున పురస్కారాలు ఇచ్చే యోచనలో ముఖ్యమంత్రి కే సి ఆర్ వున్నారని తెలంగాణ ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం ఈ సందర్భంగా  ప్రకటించారు.

ముఖ్యంగా దర్శకుడు వేణు యెల్డంది ఈ సినిమాను తెలంగాణ పల్లెల్లోని నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. తెలంగాణతో పాటు  పల్లెలతో  అనుబంధం ఉన్న ప్రతి వ్యక్తి ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఈ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ నేపథ్యంలో ఈ మూవీని అమెరికా వంటి ఓవర్సీస్‌లో మరిన్ని ప్రాంతాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా నేటి యువత డబ్బు విషయంలో ఎలా ఉంటున్నారనే విషయాన్ని హీరో పాత్ర ద్వారా చక్కగా తెరపై చూపించాడు. మంచి ఆదరణతో థియేటర్స్ లో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకున్నసంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో అంటే ఏప్రిల్ ఏడు లేక ఎనిమిదిన స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ సినిమా ఏరియా వైజ్ 20 రోజుల థియేట్రికల్ కలెక్షన్స్  విషయానికొస్తే..

ఈ సినిమా తెలంగాణ (నైజాం) - రూ. 14.41 కోట్ల గ్రాస్

రాయలసీమ (సీడెడ్) + ఆంధ్ర ప్రదేశ్  - రూ. 6.90 కోట్ల గ్రాస్

తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి. - రూ. 21.31 కోట్ల గ్రాస్ (రూ. 9.72 కోట్ల షేర్)

కర్ణాటక + రెస్టాఫ్ భారత్ + ఓవర్సీస్ - రూ. 42 లక్షల గ్రాస్

ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.73 కోట్ల గ్రాస్ (రూ. 9.92 కోట్ల షేర్ ) రాబట్టింది.

RRR: విడుదలై యేడాది కాబోతున్న ఆగని ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. తాజాగా ఈ మూవీ ఖాతాలో మరో రేర్ రికార్డు..

ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 1.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 9.92 కోట్ల షేర్ రాబట్టి  పెట్టిన పెట్టుబడికి నాలుగింతల లాభాన్ని తీసుకొచ్చింది.  ఇక  ఈ సినిమా ఇప్పటికే రూ. 8.62 కోట్ల లాభాలతో తెలుగులో మరో బ్లాక్ బస్టర్‌గా  నిలిచింది. 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, రైటర్ పద్మభూషణ్, సార్, వినరో భాగ్యము విష్ణు కథ తర్వాత ‘బలగం’ సినిమా 7వ క్లీన్‌ హిట్‌గా నిలిచింది.

First published:

Tags: Balagam Movie, Dil raju, Nandi Awards, Priyadarshi