అవతార్ సినిమా రెండవ పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “అవతార్ 2” (Avatar 2) విడుదల అయ్యింది. డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో వచ్చేసింది. 'అవతార్'కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీకి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (Avatar: The Way of Water ).ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయి థియేటర్లలో సందడి చేస్తున్నారు. (Twitter/Photo) అయితే ఈ సినిమా టికెట్లు విడుదలకు ముందు హాట్ కేకుల్లో అమ్ముడు పోయాయి. విజువల్ వండర్గా వచ్చిన ఈ మూవీని చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు.
అయితే ఈ క్రమంలో అవతార్ 2 సినిమా చూస్తూ ఆంధ్ర ప్రదేశ్లో ఓ వ్యక్తి మరణించాడు. వివరాల్లోకి వెళ్తే... కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్ళాడు. సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు. అయితే అతడ్ని తమ్ముడు రాజు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఇలాగే అవతార్-1కు కూడా జరిగింది. తైవాన్లో 42 ఏళ్ళున్న ఒక వ్యక్తి ‘అవతార్’ సినిమా చూస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. డాక్టర్లు ఆ వ్యక్తికి అధిక రక్తపోటు ఉన్నట్లు తెలిపారు. సినిమా చూస్తున్నప్పుడు ఓవర్ ఎగ్జైట్ అయ్యాడని, దానీ వల్ల ఆ వ్యక్తికి అధిక రక్తపోటు వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఏపీలో ఇలా జరగడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
మరోవైపు అవతార్ 2 మూవీ విడుదలైన ఒక్కరోజులోనే.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 మంచి ఓపినింగ్స్ రాబట్టింది. మొదటిరోజు రూ.10 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఇండియా వైడ్గా అవతార్2 కలెక్షన్స్ 35 నుంచి 40 కోట్ల వరకు ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.