నేటి బాలలే రేపటి పౌరులన్నట్టు..నేటి నటులే రేపటి పొలిటిషన్స్గా చాలా మంది సినీ తారలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే దక్షిణాది నుంచి ఎన్టీఆర్, ఎమ్జీఆర్,జయ లలిత వంటి వారు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. వాళ్ల బాటలోనే చాలా మంది నటీనటులు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగాక రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.అసలు భారతీయ సినిమా రంగంలో రాజకీయాల్లో ప్రవేశించి 1967లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి నాలుగో లోక్సభకు ఎన్నికయ్యారు. భారత దేశంలో ఒక నటుడు పార్లమెంటు సభ్యుడు కావడం అనేది జగ్గయ్యతోనే మొదలైంది. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఎంతో మంది తారలు.. రాజకీయాల్లో ప్రవేశించారు. అందులో సినీ నటి శారద, జయప్రద పార్లమెంటుకు ఎన్నికయ్యారు. శారద..తెనాలి నుంచి ల ోక్సభకు ఎన్నికైతే..జయప్రధ రాజ్యసభ సభ్యరాలిగా పనిచేసింది. ఆ తర్వాత ఆమె సమాజ్ వాదీ పార్టీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మరోవైపు సీనియర్ నటుడు సత్యనారాయణ కూడా 1996లో మచిలి పట్నం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
సత్యనారాయణ సమకాలీకుడు రావు గోపాల్ రావు, తెలుగు దేశం పార్టీ తరుపున ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగు దేశం నుంచి మోహన్ బాబు.. రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఇపుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అటు విజయశాంతి కూడా బీజేపీ,తల్లి తెలంగాణ, టీఆర్ఎస్ పార్టీలో సేవలు అందించారు.టీఆర్ఎస్ తరుపున మెదక్ లోక్సభకు ఎన్నికయ్యారు. ఇపుడు కాంగ్రెస్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
వీళ్లందరి కంటే ముందు సూపర్ స్టార్ కృష్ణ కూడా కాంగ్రెస్ తరుపున తెనాలి నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిచారు. కృష్ణ సతీమణి విజయ నిర్మలతో పాటు నరేష్ కూడా రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈయన బీజేపీ తరుపున హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు.
మరోవైపు ఆయన తోటి నటుడు కృష్ణంరాజు కూడా నర్సాపురం, కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. అంతేకాదు కేంద్రంలో మంత్రిగా పనిచేసారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి నటుడిగా రికార్డులకు ఎక్కాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యంతో పార్టీతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. అటు అన్నయ్య దారిలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన ఇపుడు భీమవరం, గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా నర్సాపురం నుంచి లోక్సభకు పోటీచేస్తున్నారు. అటు బాలకృష్ణ కూడా రెండో సారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంతకు ముందు ఆయన అన్న హరికృష్ణ..ఇదే నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు.
అటు క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాస రావు బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా పనిచేసారు. ఆయన తోటి నటుడు బాబు మోహన్ కూడా ఎమ్మెల్యేగా సేవలందించారు. వీళ్లతో పాటు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ నటీనటులు రాజకీయాల్లో తమ లక్ను పరీక్షించుటున్నారు. అందులో పోసాని కృష్ణమురళి,30 ఇయర్స్ పృథ్వీ, జయసుధ, రాజశేఖర్ జీవిత దంపతులు రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అటు రోజా కూడా వైసీపీ తరుపున నగరి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
తమిళనాడు విషయానికొస్తే..ఎమ్జీఆర్ డీఎంకే పార్టీలో ఉంటూ అన్నాడీఎంకే పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆ వారుసురాలిగా సినీ నటి జయలలిత తమిళనాడు రాజకీయాలను సీఎంగా శాసించారు. అటు ఎమ్జీఆర్ సమకాలీకులుడు శివాజీ గణేషన్ కూడా డీఎంకే, కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఆ తర్వాత తమిళగ మున్నేట్ర మున్నయ్ అనే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీతో శివాజీ గణేషణ్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు.
ఆ తర్వాత విజయ్ కాంత్ కూడా డీఎండీకే పార్టీని స్థాపించారు. ప్రస్తుతం తమిళనాడు నామ మాత్రంగా ఉంది. అటు కమల్ హాసన్ కూడా మక్కల్ నీది మయ్యం అంటూ ఒక పార్టీని స్థాపించి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక రజనీకాంత్ కూడా రాజకీయాల్లో వస్తున్నా అని ప్రకటించారు. వీరి కంటే ఎంతో మంది నటీనటులు శరత్ కుమార్, కార్తీక్, ఖుష్బు వంటి చాలా మంది నటీనటులు రాజకీయాల్లో తమ లక్ను పరీక్షించుకున్నారు. అటు విశాల్ కూడా ఫ్యాన్ క్లబ్ ‘మక్కల్ నాలా ఇయక్కమ్’ ను రాజకీయ పార్టీగా మార్చారు. అటు కన్నడ నటుడు ఉపేంద్ర కూడా ‘ప్రజాకీయ’ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు.
దక్షిణాదిలో కాకుండా ఉత్తరాదిలో కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటికే దేవానంద్, అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, సునీల్ దత్, వినోద్ ఖన్నా, శతృఘ్న సిన్హా, గోవిందా, రేసు గుర్రం విలన్ రవికిషన్ శుక్లాతో పాటు జయ బచ్చన్, రేఖ, హేమా మాలిని, స్మృతి ఇరానీ, నగ్మా, ఊర్మిళ, వంటి నటీ నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
దేవానంద్ ఎమర్జెన్సీ సమయంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. ప్రస్తుత రాజకీయాల్లో బీజేపీకి ఎక్కువగా స్టార్స్ సపోర్ట్ ఉంది. టీఎంసీ నుంచి మూన్ మూన్ సేన్,మిమి చక్రబర్తి,నుస్రత్ జహాన్, శతాబ్దీ రాయ్, దేవ్ వంటి నటీనటులతో పాటు భోజ్పురి నుంచి చిన్నా చితకా చాలా మంది నటీనటులు చాలా మంది ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.