అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమా ధియేటర్లలో విడుదలవుతుందా లేక అంతకంటే ముందే డిజిటిల్ ఫ్లాట్ఫాంలో ఆడియెన్స్ ముందుకు వస్తుందా అనే అంశంపై కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. చాలా నెలల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఓటీటీలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో ఈ అంశంపై తర్జనభర్జన పడిన నిర్మాతలు... తాజాగా ఈ సినిమాను అమెజాన్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఆమెజాన్లో జూన్ నెలలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. ఈ సినమాకు డిజిటల్ హక్కులను ఆమెజాన్ రికార్డ్ స్థాయి రేటుకు కొనగోలు చేసిందని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇక రిలీజ్ విషయం అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించాల్సిన అవసరం ఉంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కేఎఫ్సీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Shetty