అనుష్క శెట్టి... తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది అనుష్క. అగ్రహీరోలతో నటించడమే కాకుండా లేడీ ఓరియంటడ్ సినిమాలు కూడా తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ.. లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టితో కలిసి నటిస్తోంది. అనుష్క, నవీన్ ప్రధాన పాత్రల్లో ప్రతిష్ఠాత్మక యు.వి.క్రియేషన్స్ ఓ సినిమా అనౌన్స్ చేసింది. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్ కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా.
ఇప్పటికే యువీ క్రియేషన్స్లో అనుష్క రెండు సినిమాలు చేసింది. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ వారు నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అనుష్కకు కూడా మంచి పేరు తెచ్చి పెట్టాయి. భాగమతి సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఒకేసారి విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అనుష్క యు.వి.క్రియేషన్స్ కలిసి సినిమా చేస్తున్నారు. నవీన్ పొలిశెట్టి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. నవీన్ పొలిశెట్టి కూడా నటనలో అభిమానులతో మంచి మార్కులు వేయించుకున్నాడు. ఏజెంట్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో ప్రేక్షకులకు బాగా కనక్ట్ అయ్యాడు. దీంతో మంచి ఫామ్లో వీరిద్దరితో కలిసి సినిమా రావడం అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
దర్శకుడు మహేష్ బాబు న్యూ ఇమేజ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 4 నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. అయితే సైలెంట్గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు అనుష్క శెట్టి. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే దీనిపై దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాను కూడా మహేష్ బాబు అన్ని భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.