జబర్దస్త్ యాంకర్ అనసూయకు సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువైపోయాయి. కొందరు చేస్తున్న అసభ్య కరమైన వ్యాఖ్యలు అనసూయకు మానసిక వ్యధను మిగిలుస్తున్నాయి. దీంతో ఆమె ఏ మాత్రం లేట్ చేయకుండా తనపై చేస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలపై పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ట్విట్టర్ వేదికగా ఫిర్యాదుసైతం చేయడం గమనార్హం. సదరు ఫిర్యాదుపై సైబర్ క్రైమ్స్ పీఎస్ హైదరాబాద్ సిటీ పోలీస్ వారు సైతం స్పందించడం విశేషం. అంతేకాదు అనసూయ భరద్వాజ్ తన ట్వీట్ లో శృతి మించుతూ చేస్తున్న అసభ్య వ్యాఖ్యలకు స్పందించకపోతే ఇక సహనానికి అర్థం ఉండదని పేర్కొన్నారు. అంతేకాదు తనపై చేసిన వ్యాఖ్యలకు తానేమి సిగ్గుపడటం లేదని, సరియైన వ్యవస్థలు చర్య తీసుకోవాలని పేర్కొంటూ అనసూయ ట్వీట్ చేసింది. అందుకు ప్రతిగా సిటీ సైబర్ పోలీసులు సైతం స్పందించడం విశేషం. అనసూయ తనకు పోలీసుల నుంచి లభించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Jabardasth