బాలీవుడ్లో మరో కరోనా పాజిటివ్ కేసు వచ్చింది. ఈ సారి ఏకంగా అమితాబ్ బచ్చన్ దీని బారిన పడ్డాడు. ఈయన ముంబైలోని నానావతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు.తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే ట్వీట్ చేసాడు. తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఐసోలేషన్లో ఉన్నారని చెప్పాడు అమితాబ్. ఈయన మాత్రం ముంబై నానావతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అప్పట్లో ఈయన కొన్నిసార్లు అనారోగ్యం పాలయ్యారు. కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండి చికిత్స కూడా తీసుకున్నాడు.
T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited ..
All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !
— Amitabh Bachchan (@SrBachchan) July 11, 2020
అనారోగ్యం నుంచి కుదుటపడిన తర్వాత వరస సినిమాలు కూడా చేసాడు బాలీవుడ్ మెగాస్టార్. మళ్లీ ఇన్నాళ్లకు ఎందుకో తెలియదు కానీ ముంబై నానావతి హాస్పిటల్లో జులై 11 రాత్రి అడ్మిట్ అయ్యాడు. ఈయనకు కరోనా సోకిందనే విషయం తెలియగానే అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. తనను గత పది రోజులుగా కలిసిన వాళ్లు కూడా వెంటనే టెస్టులు చేయించుకోవాలని సూచించాడు అమితాబ్ బచ్చన్.
ఇప్పటికే ముంబైలో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. అక్కడ బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే టాలీవుడ్లో నిర్మాత పోకూరీ రామారావు కరోనాతో చనిపోయాడు. ఇక బాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ కరోనాతోనే చనిపోయాడు. ఆయనతో పాటు మరో అరడజన్ మంది కూడా కోవిడ్ 19 కారణంగా కన్నుమూసారు. అందులో సీనియర్ నటులతో పాటు నిర్మాతలు కూడా ఉన్నారు. ఇప్పుడు అమితాబ్ కూడా కోవిడ్ బారిన పడటంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Bollywood, Hindi Cinema