వరల్డ్ ఫేమస్ లవర్,కౌసల్య కృష్ణమూర్తి లాంటి సినిమాలతో తెలుగు నాట పాప్లారిటీ సంపాదించిన హీరొయిన్ ఐశ్వర్య రాజేష్. చైల్డ్ ఆరిస్ట్గా ఇండ్రీస్లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య తమిళనాట మంచి పాప్లారటీ తెచ్చుకుంది. తెలుగు కుటుంబంలో పుట్టిన ఐశ్వర్య చెన్నైలోనే పెరిగింది. తమిళంలో ఇప్పటివరకు 25 సినిమాలకు పైగా చెసింది. ఇప్పడు దక్షిణాదిలోని అన్ని చిత్ర పరిశ్రమలో ఆమె కాలుమెపింది. హిందిలోనూ అవకాశాలు దక్కించుకుంటుంది. తెలుగు భామ ఐశ్వర్య రాజేష్కు తమిళ్లో మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ అక్కడ హీరోయిన్గా రాణిస్తూ పలు సినిమాల్లో నటించి అదరగొట్టింది. కెరీర్ ఆరంభంలో తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి రమ్మీ, పన్నైరమ్ చిత్రాల్లో నటించింది. గతేడాది తెలుగులో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన క్రాంతి మాధవ్ తెరకెక్కిస వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటించింది. తెలుగు బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఒకప్పటి తెలుగులో హీరోగా విలన్గా మెప్పించిన రాజేష్ కూతురు. ఒకప్పటి లేడీ కమెడియన్ శ్రీ లక్ష్మి ఐశ్వర్య రాజేష్కు మేనత్త అవుతోంది. తమిళ టీవీ చానెల్లో ఓ రియాలిటీ షో ద్వారా ఐశ్వర్య తన కెరీర్ను ప్రారంభించారు. 2010లో ‘నేతన్ అవన్’ సినిమాతో హీరొయిన్గా తెరంగేట్రం చేశారు ఐశ్వర్య రాజేష్.
ఇక తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తో ఐశ్వర్య ఎక్కువ గా పాపులర్ అయినప్పటికీ కానీ ఆమె చిన్నప్పుడే బాల నటి గా తెలుగు సినిమాల్లో నటించారు. రాజేంద్ర ప్రసాద్ సినిమా “రాంబంటు” లో ఐశ్వర్య బాలనటి గా చెసింది. ఆ సినిమాలో ఓ చిలిపి సంఘటనను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికి గుర్తుచెసుకుంటారు. ఐశ్వర్య కు ముద్దు పెట్టె సిన్ చిత్రీకరిస్తున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ ముద్దు పెట్టినప్పుడు ఐశ్వర్య దానిని తుడిచేసుకునేదట. ఆ సన్నివేశంలోపదిహేనుసార్లు ఆయన ముద్దు పెట్టడం అలా 15 సార్లు ఈమె తుడిచేసుకుందట!. దీంతో రాజేంద్రప్రసాద్ సరదాగా ఆ విషయాన్ని అప్పడప్పుడు గుర్తుచేసుకుంటరంటా!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aishwarya Rajesh