అవును కొన్నేళ్ల క్రితం వరకు చిరంజీవి రాజకీయాలతో బిజీగా ఉంటే.. పవన్ కళ్యాన్ సినిమాలతో తీరిక లేకండా ఉండేవారు. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. ఇపుడు మెగాస్టార్ మాత్రం..వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. ఫలితాల కోసం నెలన్నరకు పైగా టైమ్ ఉంది. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ .. ఇపుడు సేద తీరుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్..ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘చిత్రలహరి’ సినిమా చేసాడు. చూడటమే కాదు. ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన సాయి ధరమ్ తేజ్కు ప్రశంసలు కురిపించడమే కాదు..మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు ఒక బొకే పంపించాడు.
ఇక పవన్ కళ్యాణ్ కంటే ముందు చిరంజీవి కూడా ‘చిత్రలహరి’ సినిమా చూసి సాయి ధరమ్ తేజ్నటనను మెచ్చుకున్నాడు. మరోవైపు చిత్రం సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర దర్శక,నిర్మాతలకు అభినందనలు తెలియ జేసాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని,నివేథా పెతురాజ్లు హీరోయిన్స్గా నటించారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతున్న సినిమా నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్కు లాభల పంట పండించింది. ఇప్పటికే ఈ సినిమా ఓవరాల్గా రూ.20 కోట్ల గ్రాస్..రూ.14 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ‘చిత్రలహరి’ సక్సెస్.. మైత్రి మూవీ మేకర్స్తో పాటు ఈ సినిమాలో నటించిన ప్రతి టెక్నీషియన్ కెరీర్కు ప్రాణం పోసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Box Office Collections, Chiranjeevi, Janasena party, Pawan kalyan, Praja rajyam, Sai Dharam Tej, Tollywood Box Office Report