హోమ్ /వార్తలు /సినిమా /

ప్రభాస్‌ను వీడని 'సాహో, కష్టాలు.. తాజాగా కేసు నమోదు..

ప్రభాస్‌ను వీడని 'సాహో, కష్టాలు.. తాజాగా కేసు నమోదు..

‘సాహో’ పోస్టర్ Photo ; Twitter

‘సాహో’ పోస్టర్ Photo ; Twitter

సాహో సినిమా ప్రొడ్యూసర్స్ పై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైంది.

ప్రభాస్ హీరోగా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన భారీ సినిమా సాహో తెలిసిందే. అది అలా ఉంటే సాహో సినిమా ప్రొడ్యూసర్స్ పై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరుకు చెందిన ఔట్ షైనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబందించిన బ్యాగుల్నీ తమ సినిమాలో ప్రమోట్ చేస్తామని చెప్పి.. సాహో నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ ఓ అగ్రిమెంట్ చేసుకుని ఆ తర్వాత దానిని పట్టించుకోలేదని ఓ కేసు నమోదు చేశారు ఆ సంస్థ ప్రతినిధులు.


తమ సంస్థ తయారు చేసిన బ్యాగులను సాహో సినిమాలో హీరో, హీరోయిన్స్ వాడుతున్నట్టు చూపిస్తామని., ఆ బ్యాగులకు తగిన ప్రచారం కల్పిస్తామని గత ఏడాది జులై 8న సాహో నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నమన్నారు. అందులో భాగంగా... ఆ ఒప్పందం ప్రకారం రూ.1.38 కోట్లకుపైగా డబ్బు తీసుకున్న చిత్ర నిర్మాతలు... సాహో సినిమాలో మా ప్రొడక్ట్స్‌ను చూపించకుండా మమ్మల్నీ మోసం చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ బ్యాగుల తయారీ ఆ సంస్థ మార్కెటింగ్‌ హెడ్‌ విజయరావు గురువారం మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బ్యాగుల సంస్థ నుండి అందుకున్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టనున్నామని మాదాపూర్ ఇన్‌స్పెక్టర్‌  ఎస్‌.వెంకట్‌ రెడ్డి తెలిపారు.

First published:

Tags: Sahoo, Telugu Movie News

ఉత్తమ కథలు