హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Adopt a Child: అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడమెలా?

Adopt a Child: అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడమెలా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Adopt a Child: అనాథ పిల్లల్ని దత్తత తీసుకునేందుకు నేటి తరం దంపతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రక్రియ చట్టబద్ధంగా చేసుకునే వారికే న్యాయపరమైన గుర్తింపు లభిస్తుంది. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఉంటాయి.

రోజురోజుకీ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో చాలామంది నేటితరం దంపతులు పిల్లల్ని కనకుండా, దత్తత తీసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఒక అనాథకు కుటుంబాన్ని ఇవ్వడంతో పాటు పిల్లలు కావాలనే తమ కోరిక కూడా తీరుతుందనే ఆశతో దత్తత తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే చాలామందికి దత్తత ఎలా తీసుకోవాలనే విషయంపై అవగాహన ఉండదు. మరికొందరైతే గుట్టుచప్పుడు కాకుండా ఓ రహస్య ఒప్పందం ప్రకారం పిల్లలను దత్తత తీసుకుంటూ ఉంటారు. ఇది చట్టప్రకారం నేరం.

కొన్నాళ్లుగా అనాథపిల్లల దత్తతును ప్రోత్సాహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం కూడా చేస్తున్నాయి. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే ప్రతిఒక్కరూ కచ్చితంగా కొన్ని నియమనిబంధనలు ఆచరించాల్సి ఉంటుంది.

చట్టప్రకారం తీసుకునే దత్తత వల్లే మాత్రం బిడ్డ తల్లిదండ్రులను అధికారికంగా నమోదు చేసేందుకు వీలుంటుంది. స్కూల్లో చేర్పించాలన్నా, బర్త్ సర్టిఫికెట్ పొందాలన్నా చట్టప్రకారం దత్తతును నమోదుచేయాల్సి ఉంటుంది. నోటి మాటగా చేసుకునే దత్తతు వల్ల భవిష్యత్తులో అనేక చట్టపరమైన, న్యాయపరమైన సమస్యలు వస్తాయి.

బాలికను దత్తత తీసుకునేటప్పుడు ఉండే నియమాలు, బాలుడిని దత్తత తీసుకునే ముందు పాటించాల్సిన నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. ముఖ్యంగా దంపతులిద్దరూ మేజర్లు అయి ఉంటేనే పిల్లలను దత్తత చేసుకునేందుకు అర్హులు. పిల్లల దత్తతకు భార్య అనుమతి తప్పనిసరి.

ఒకవేళ ఒక్కరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్న వ్యక్తి, ఎవ్వరినైనా దత్తత తీసుకోవాలనుకుంటే సతీమణులందరి దగ్గరా అనుమతి తీసుకోవాలి. ఒకవేళ భార్య చనిపోయిన వ్యక్తి లేదా బ్రహ్మచారి ఎవ్వరినైనా దత్తతు తీసుకోవాలనుకుంటే... అతని మానసిక స్థితి సరిగా ఉందనే సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒంటరి మహిళలైతే ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అనాథాశ్రమం నిర్వహించే సంరక్షకుడు మాత్రమే దత్తత ఇచ్చేందుకు చట్టబద్ధంగా అర్హుడు. చట్టప్రకారం నమోదు చేయబడిని అనాథాశ్రమం నుంచి మాత్రమే పిల్లలను దత్తత చేసుకోవడానికి వీలుంటుంది.

అనాథాశ్రమం నుంచి పిల్లలను దత్తత తీసుకునేటప్పుడు కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. 15 ఏళ్లు నిండన పిల్లలను మాత్రమే దత్తత తీసుకోవడానికి వీలుంటుంది...

బాలుడిని దత్తత తీసుకోవాలంటే, ఆ దంపతులకు మగ పిల్లలు ఉండకూడదు. పిల్లలు లేని దంపతులు మాత్రమే దత్తతుకు ప్రధాన అర్హులు. బాలికను దత్తత చేసుకోవాలంటే, వారికి కుమార్తె గానీ, కుమార్తెలు గానీ ఉండకూడదు. అలాగే దత్తతు చేసుకునే బాలిక వయసు కంటే, దత్తత స్వీకరించాలనుకునే తండ్రి వయసు కనీసం 21 సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి.

అనాథపిల్లలను దత్తత తీసుకోవాలనుకునే దంపతులు, ముందుగా స్త్రీ- శిశు సంక్షేమశాఖ వెబ్‌సైట్లో లాగిన్ అవ్వాలి. పాన్‌కార్డు నెంబర్ ద్వారా దత్తతకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దత్తతు చేసుకోవాలనుకునేవాళ్లు కచ్చితంగా పాన్ కార్డు, రెసిడెన్స్ ఫ్రూఫ్, ఆదాయ దృవీకరణ పత్రం, వివాహ నమోదు పత్రం, దంపతులిద్దరి బర్త్ సర్టిఫికెట్లు, హెల్త్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు కనీసం ఇద్దరు వ్యక్తుల నుంచి సిఫారసు లేఖలు, వారి ఐడీ కార్డులతో సహా దాఖలు చేయాలి.

భార్యభర్తలిద్దరి పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు, ఇద్దరు కలిసి దిగిన పెళ్లి ఫోటోను కూడా దరఖాస్తుతో పాటు సమర్పించాలి. వీటితో పాటు ఆరు వేల రూపాయల డీడీ అప్లికేషన్ ఫారంతో పాటు 40 వేల రూపాయలను దత్తత తీసుకునే సమయంలో సంబంధిత అనాథాశ్రమానికి డీడీ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.

First published:

Tags: Life Style, World

ఉత్తమ కథలు