అందం (beauty) ప్రతిబింబించేది మన చర్మం (skin) ద్వారానే. అయితే చాలామంది ముఖ్యంగా మగవాళ్లు ఆ చర్మాన్ని అశ్రద్ధతో పాడుచేసుకుంటారు. మళ్లీ ఏవేవో క్రీమ్లు వాడుకుంటూ డబ్బులు తగలేస్తుంటారు. కానీ, మనం అప్పుడప్పుడు చేసే కొన్ని పనుల్లో జాగ్రత్తలు తీసుకుంటే (Skin care for boys) మృదువైన (Smooth), అందమైన చర్మం (beautiful skin) మన సొంతమవుతుందని తెలుసా. చర్మాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యమైన విషయం. రోజంతా మీ చర్మం(skin) వివిధ కలుషితాలను ఎదుర్కొంటుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను అడ్డుకుంటుంది. చర్మ రంధ్రాలను కూడా అడ్డుకుంటుంది. ఫలితంగా, చర్మం సరిగా శ్వాస (breath) తీసుకోకపోవచ్చు. వివిధ చర్మ సమస్యల (problems)ను ఎదుర్కొనవచ్చు. అందువల్ల, రోజుకు 2 సార్లు ముఖాన్ని కడగడం (face wash) అవసరం. ఉదయం, రాత్రి పడుకునే (before sleep) ముందు ఒకసారి చేయండి.
చర్మం నల్లబడకుండా..
మందికి శరీరంలోని కొన్ని భాగాల్లో చర్మం (skin) నల్లబడుతుంటుంది (turn black). ముఖ్యంగా ఎండ, వేడి తగిలే ప్రాంతంలో ఎక్కువగా నల్లబడుతుంటుంది. కొంత మందికి పడటమే కాకుండా మచ్చలు (spots) కూడా ఏర్పడుతుంటాయి. సమస్యలు రాకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. అలాగే కొన్ని చిట్కాలు (beauty tips) పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చర్మం నల్లబడకుండా (black spots on skin) ఉండాలంటే మంచి నీళ్లు (water) ఎక్కువగా తాగాలి. కాకుండా తాజా పండ్ల రసాలు (fruit juice), మజ్జిగ (butter milk) తాగుతుండాలి. పుచ్చకాయలు, నల్ల ద్రాక్ష, దానిమ్మ పండ్లు వంటివి ఎక్కువగా తినాలి. బయటకు పోవడానికి అర్ధగంట ముందు సన్ స్క్రీన్ లోషన్ (sun screen lotion) ముఖానికి రాసుకుని బయటికి వెళ్లాలి. ఆ రోజు స్నానానికి 20 నిమిషాల ముందు నల్ల ద్రాక్ష గుజ్జు, తేనె (honey) కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి.
ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?
బాదంపప్పును బాగా నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం పాలపొడి, కొద్దిగా తేనె,కొన్ని చుక్కల నిమ్మరసం (lemon), కొంచెం ఆలివ్ ఆయిల్ (alive oil) ను చేర్చాలి. ఈ మిశ్రమాన్ని మెడ చుట్టూ అప్లై చేయాలి. అర్థగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడ మీద ఉన్న నలుపు (black) పోయి అందంగా కనబడుతుంది.
ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?
ముఖం మీద మచ్చలు (black spots) ఎక్కువగా ఉన్నప్పుడు క్యారెట్ ముక్కలు కొన్ని, క్యాబేజీ ముక్కలు కొన్ని, ఓట్స్ కొన్ని కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కి సగం స్పూన్ పాల మీగడ, సగం స్పూన్ తేనె,మూడు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉన్న మచ్చలు తగ్గుతాయి.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
ఇవి కూడా చదవండి: తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి
ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.