తేనెలో ఎండు ఖర్జూరాల్ని నానబెడితే : ఎండు ఖర్జూరాలు, పటికబెల్లాన్ని నీటిలో నానబెట్టి తింటే... చలవ చేసి... శరీరంలో వేడిని తగ్గిస్తాయని మనకు తెలుసు. అదే ఎండు ఖర్జూరాల్ని తేనెలో నానబెట్టి తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందుకు కొన్ని పద్ధతులు పాటించాలి. ఓ చిన్న గిన్నెలో సగానికి పైగా తేనె పోసి... సీడ్ లెస్ ఎండు ఖర్జూరాల్ని వెయ్యాలి. వాటిని బాగా కలియబెట్టాలి. తర్వాత ఓ గాజు సీసా లేదా కంటైనర్ తీసుకొని... అందులో ఆ మిశ్రమాన్ని వెయ్యాలి. ఇంట్లో ఏదైనా ఎండ తగలని ప్రదేశంలో ఓ వారం పాటూ కదపకుండా ఉంచాలి. ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన పనిలేదు. బయటే ఉంచొచ్చు.
వారం పాటూ తేనెలో నానడం వల్ల ఖర్జూరాలు చాలా మెత్తగా, మృదువుగా తయారవుతాయి. వారం తర్వాత రోజుకు ఒకటి, రెండు ఖర్జూరాలని తినొచ్చు. ఆల్రెడీ అవి తేనెను పీల్చేసుకుంటాయి కాబట్టి... అందులో తేనే పెద్దగా మిగలదు. తేనెను ప్రత్యేకంగా తీసుకోవాల్సిన పనిలేదు. ఖర్చూరాన్ని తింటే, దానిలోనే కావాల్సినంత తేనె కూడా ఉంటుంది.
ప్రయోజనాలు : ఖర్జూరాలకు మన శరీరంలో వేడిని తగ్గించే అద్భుత గుణాలున్నాయి. వీటికి తేనె కూడా తోడవడం వల్ల దగ్గు, జలుబు, పడిశం వంటివి త్వరగా నయం అవుతాయి. వీటికి రోగాల్ని తగ్గించే గుణం ఉండటం వల్ల... చాలా రకాల రోగాలు రాకుండా ఆగిపోతాయి. నిద్ర పట్టని వాళ్లు రాత్రివేళ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలు... చక్కటి నిద్ర పడుతుంది. ఈ మిశ్రమం ఎంత మంచిదంటే... దీన్లో చాలా యాంటీ బయోటిక్ గుణాలున్నాయి. ఇవి గాయాలు, వాపులు ఇతరత్రా అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తాయి.
మలబద్ధకంతో బాధపడే వారు వారంలో కనీసం మూడు రోజులైనా తేనె ఖర్జూరాల్ని తింటే సమస్య తొలగిపోతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి... అది ఆహారం చక్కగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. గ్యాస్, ఏసీడీటీ సమస్యలు పరారవుతాయి. కడుపులో ఉండే చెడు క్రిములు చనిపోతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ఇవి కూడా చదవండి :
#HealthTips: కర్పూరంతో ఎన్ని సమస్యలు తగ్గుతాయో తెలుసా..
#Health Tips: పెసలు తింటే ఎన్ని లాభాలో చూడండి..
చుండ్రుని పోగొట్టి.. జుట్టు అందంగా మారాలంటే ఇలా చేయండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Life Style, Tips For Women, Women health