హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Future Teachers : టీచర్ వృత్తిపై ఆసక్తిగల వారికి గుడ్​న్యూస్​.. పూర్తి వివరాలివే..!

Future Teachers : టీచర్ వృత్తిపై ఆసక్తిగల వారికి గుడ్​న్యూస్​.. పూర్తి వివరాలివే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Future Teachers : పాఠ్యాంశాలను ప్రాంతీయ భాషల్లో బోధించడం, పాఠశాల పిల్లలకు ఇతరులతో పాటు కోడింగ్ నేర్పించడం లాంటి అనేక మార్పులను ఈ నూతన విద్యా విధానంలో ప్రవేశపెట్టారు.

ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలంటే బీఈడీ తప్పకుండా చేయాలి. రెండేళ్ల పాటు ఈ కోర్సును అభ్యసించి ఉత్తీర్ణత సాధిస్తే టీచర్ పోస్టులకు అర్హత సాధిస్తారు. అయితే త్వరలో ఈ రెండేళ్ల బీఈడీ కోర్సును నాలుగేళ్లకు పొడిగించనుంది కేంద్ర ప్రభుత్వం. నూతన విద్యావిధానం(NEP) ప్రకారం బీఈడీ ఇంటిగ్రేటెడ్ కోర్సును నాలుగేళ్లు ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు బీఏ, బీఈడీ లేదా బీఎస్సీ, బీఈడీ కలిపి(3+2) ఐదు సంవత్సరాలు అభ్యసించాల్సి వచ్చేది. తాజాగా ప్రకటించిన ఈ నూతన విధానంతో విద్యార్థులు ఓ సంవత్సరం వృథా కాకుండా నాలుగేళ్లలోనే ఈ రెండు డిగ్రీలను పూర్తి చేయవచ్చు.ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు సమకాలీన ఉపాధ్యాయులను తయారు చేయడంలో సహాయపడుతుందని మాజీ విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ గతంలోనే ప్రకటించారు.

పాఠ్యాంశాలను ప్రాంతీయ భాషల్లో బోధించడం, పాఠశాల పిల్లలకు ఇతరులతో పాటు కోడింగ్ నేర్పించడం లాంటి అనేక మార్పులను ఈ నూతన విద్యా విధానంలో ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ కొత్త డిగ్రీలు ఉపాధ్యాయులను అందుకు తగినట్లుగా సిద్ధం చేస్తాయి. అంతేకాకుండా కొత్త పాఠ్యాంశాలను(curriculum) కలిగి ఉంటాయి.2030 నాటికి నాలుగు ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీని బోధనకు అవసరమైన కనీస డీగ్రీగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యూకేషన్(NCTE) ఈ కోర్సు పాఠ్యాంశాలను విద్యార్థికి అవకాశం కల్పించే విధంగా రూపొందించింది.

చరిత్ర, గణితం, సైన్స్, ఆర్ట్స్, ఎకనామిక్స్ లేదా కామర్స్ లాంటి ప్రత్యేక క్రమశిక్షణతో పాటు విద్యలో డిగ్రీని పొందేలా సిద్ధం చేసింది. ఈ నూతన బీఈడీ కోర్సులు ప్రతిభావంతులైన పిల్లల ప్రత్యేకతను తెరపైకి తీసుకొస్తుంది.2022-23 అకడమిక్ సెషన్ నుంచి నాలుగు సంవత్సరాల ఐటీఈపీ కోర్సు ప్రారంభం అవుతుంది. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET) ద్వారా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) దీనికి సంబంధించిన అడ్మిషన్లను నిర్వహిస్తుంది. ఈ కోర్సును మల్టీ డిసిప్లీనరీ సంస్థలు అందిస్తాయి. అంతేకాకుండా పాఠశాల ఉపాధ్యాయులకు కనీస డిగ్రీ అర్హతగా మారుతుంది.

నూతన విద్యా విధానానికి అనుగుణంగా సమూల మార్పులు...

"ఈ కోర్సు ఉపాధ్యాయులతో పాటు మొత్తం విద్యా రంగం పునరుద్ధరణకు దోహదపడుతుంది. భారతీయ విలువలు, సంప్రదాయాలపై ఆధారపడిన బహుళ క్రమశిక్షణ వాతావరణం ద్వారా ఈ కోర్సు నుంచి ఉత్తీర్ణత సాధించే భావితరపు టీచర్లను 21వ శతాబ్దపు అవసరాలను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా భారత్ నూతన భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడతారు." అని విద్యా మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి : ప్రతినెలా రూ. 25 వేల స్టైఫండ్..​​ దాని కోసం ఇలా చేయండి..

ఒకటి, రెండు సంవత్సరాల బీఈడీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారికి రెండేళ్ల బీఈడీ కోర్సు ఉంటుంది. నాలుగు సంవత్సరాల మల్టీ డిసిప్లీనరీ బ్యాచిలర్ డిగ్రీకి సమానమైన లేదా మాస్టర్స్ డిగ్రీ పొందిన వారికి ఒక సంవత్సరం డిగ్రీ బీఈడీ ప్రోగ్రామ్స్ అందిస్తారు. ఈ అభ్యర్థులు నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ 2020 ప్రకారం స్పెషలిటీ సబ్జెక్టు(UG లేదా పీజీ స్థాయిలో అభ్యసించే సబ్జెక్టు) టీచర్లుగా నియామకమవుతారు.

First published:

Tags: Aim teacher, Central Government, EDUCATION, Teaching, Upcoming jobs

ఉత్తమ కథలు