హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC Civil Notification: యూపీఎస్సీ నుంచి జంబో నోటిఫికేషన్.. 1105 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

UPSC Civil Notification: యూపీఎస్సీ నుంచి జంబో నోటిఫికేషన్.. 1105 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UPSC Civil Notification: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ కు సంబంధించి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అతి పెద్ద మొత్తంలో పోస్టులను కేటాయిస్తూ.. నేటి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Union Public Service Commission)  సివిల్ సర్వీసెస్ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.  దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. UPSC CSE ప్రీ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా చేసుకోవచ్చు. ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు అంటే 01 ఫిబ్రవరి 2023న విడుదల చేశారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 21 ఫిబ్రవరి 2023 చివరి తేదీగా పేర్కొన్నారు. చివరి తేదీకి ముందు సూచించిన ఫార్మాట్‌లో దరఖాస్తులను సమర్పించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే.. సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పిస్తారని తెలిపారు.

UPSC CSE పరీక్షకు దరఖాస్తు చేయడానికి.. మీరు ఈ వెబ్‌సైట్‌ను upsconline.nic.in సందర్శించవచ్చు లేదా upsc.gov.in దీని ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. UPSC సివిల్ ఎగ్జామ్ 2023 కోసం దరఖాస్తులు ఫిబ్రవరి 21 వరకు ఉంటాయి. అప్లికేషన్ కరెక్షన్ విండో మరుసటి రోజున అంటే ఫిబ్రవరి 22న ఓపెన్ అవుతుంది. ఈ విండో సహాయంతో అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 28 వరకు సవరణలు చేసుకోవచ్చు.

ప్రిలిమినరీ ఎగ్జామ్ 28 మే 2023న నిర్వహించబడుతుంది . ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1105 ఖాళీలను నియామకం కోసం భర్తీ చేస్తారు. ఇప్పటి వరకు విడుదలైన సివిల్ నోటిఫికేషన్ లో అతి భారీ మొత్తంలో పోస్టులను కేటాయించిన నోటిఫికేష్ ఇదే.

దరఖాస్తు రుసుము విషయానికొస్తే.. ఈ పరీక్షకు జనరల్ కేటగిరీ అభ్యర్థి రూ. 100 ఫీజు చెల్లించాలి. SC, ST, PWD మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందిన అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి వయోపరిమితి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 21 నుంచి 32 ఏళ్లు. రిజర్వ్‌డ్ మరియు ఇతర వర్గాలకు వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తుకు సంబంధించిన వివరాలను చూడటానికి అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నోటీసును తనిఖీ చేయండి. ఈ లింక్  ద్వారా కూడా మీరు ఆ నోటీస్ లో పేర్కొన్న వివరాలను తెలుసుకోవచ్చు.

KVS Admit Cards: అభ్యర్థులకు అలర్ట్.. కేవీఎస్ (KVS) అడ్మిట్ కార్డులు విడుదల..

దరఖాస్తుదారు ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) నమోదు చేసుకోవాల్సి ఉంటుది.  ఆపై దరఖాస్తులను ఓటీఆర్ ద్వారా చేసుకోవాలి. ఈ సంవత్సరం కమిషన్ 1105 ఖాళీలను భర్తీ చేస్తోంది.  దివ్యాంగులకు ఈ సారి భారీ మొత్తంలో ఖాళీలను కేటాయించారు. ఇందులో బెంచ్‌మార్క్ వైకల్యం కేటగిరీకి చెందిన వ్యక్తుల కోసం 37 ఖాళీలు , సెరిబ్రల్ పాల్సీ, లెప్రసీ క్యూర్డ్, డ్వార్ఫిజం, యాసిడ్ దాడి బాధితులు మరియు కండరాల బలహీనతతో సహా లోకోమోటర్ వైకల్యం కోసం 15 పోస్టులను కేటాయించారు.  ఉన్నాయి.  బహుళ వైకల్యాల కోసం 10 ఖాళీలు. అభ్యర్థులు 28 మే 2023 (ఆదివారం) న జరగనున్న CSE ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ అండ్ దరఖాస్తుల సమర్పణ ఈ లింక్ ద్వారా చేసుకోవచ్చు.

First published:

Tags: JOBS, UPSC

ఉత్తమ కథలు