హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC పేపర్ లీక్ కేసులో తొలి వేటు..ఆ ఇద్దరి ఉద్యోగాలు తొలగింపు!

TSPSC పేపర్ లీక్ కేసులో తొలి వేటు..ఆ ఇద్దరి ఉద్యోగాలు తొలగింపు!

పేపర్ లీక్ కేసులో తొలి వేటు

పేపర్ లీక్ కేసులో తొలి వేటు

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుకకు అధికారులు బిగ్ షాకిచ్చారు. పేపర్ లీక్ లో రేణుక, ఆమె భర్త ప్రమేయం ఉండడంతో వారిద్దరిని ఉద్యోగాల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుకకు అధికారులు బిగ్ షాకిచ్చారు. పేపర్ లీక్ లో రేణుక, ఆమె భర్త ప్రమేయం ఉండడంతో వారిద్దరిని ఉద్యోగాల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం బాలికల గురుకుల పాఠశాలలో రేణుక హిందీ టీచర్ గా పని చేస్తుంది. అలాగే ఆమె భర్త డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపిడివో ఆఫీస్ లో ఉపాధి హామీ స్కీమ్ టెక్నీకల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. కాగా పేపర్ లీక్ కేసులో ప్రధానంగా ప్రవీణ్, రేణుక, రాజశేఖర్, రేణుక భర్త ప్రధాన పాత్ర ఉందని సిట్ దర్యాప్తులో తేలింది. దీనితో అధికారులు పేపర్ లీక్ లో తొలి వేటు వేశారు.

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ లో కొత్త లింకులు..వాట్సప్ చాట్ ఆధారంగా కూపీ లాగుతున్న సిట్

ఈ ఘటనపై సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో రేణుక పాత్రపై ఆరా తీసిన పోలీసులు ఆమె హస్తం ఉందని తేల్చారు. దీనితో రేణుక పని చేసే స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్సి గురుకుల సొసైటీ సెక్రెటరీ రోనాల్డ్ రాస్ కు నివేదిక పంపించారు. ఈ మేరకు నివేదికను పరిశీలించిన ఆయన రేణుకను ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆమె భర్త డాక్యా నాయక్ పాత్ర కొంత ఉండడంతో అతడిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో కొత్త కోణం..ప్రవీణ్ ఫోన్ లో విస్తుపోయే విషయాలు..

అసలెవరీ రేణుక?

కాగా ఈ కేసులో A1గా ప్రవీణ్, A2గా రాజశేఖర్, A3గా రేణుక నిందితులుగా ఉన్నారు. అయితే ఇందులో ప్రవీణ్, రాజశేఖర్ TSPSCలో పని చేసే వ్యక్తులు కాగా రేణుక బుద్దారం ఎస్సి గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా పని చేస్తుంది. అయితే ఆమె సెలవుల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈ ఏడాదిలో 12 సార్లు ఆమె బడికి సెలవు పెట్టింది. తమ బంధువు చనిపోయాడని ఈనెల 4,5వ తేదీన రేణుక బడికి సెలవు పెట్టింది.  అయితే ఆ తేదిల్లోనే ఈ పేపర్ లీకేజీ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు TSPSC నిర్వహించే ప్రతీ హెగ్జామ్ ముందు కూడా రేణుక సెలవు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా కాన్ఫిడెన్షియల్ రూం ఇంఛార్జి శంకర్ లక్ష్మిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా సిట్ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది.

First published:

Tags: JOBS, Telangana, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు