రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80,000 ఉద్యోగాలకు పైగా ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ (TSPSC) వద్ద ఇప్పటికే వన్ టైం రిజిస్టేషన్(ఓటీఆర్) చేసుకున్న 25 లక్షల మంది నిరుద్యోగుల్లో అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్య. తాజా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థుల స్థానికతను గుర్తించేందుకు ఉద్యోగాల నోటిఫికేషన్కు ముందే టీఎస్పీఎస్సీ ఈ ప్రక్రియను ప్రారంభించింది. 1-7 తరగతుల్లో చివరి నాలుగేళ్లు(4-7 తరగతులు) చదివిన జిల్లానే స్థానికంగా పరిగణిస్తారు. గతంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో లోకల్, నాన్లోకల్ అని కేవలం ప్రస్తావించేవారు. ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉండేది. ఈసారి ధ్రువీకరణ పత్రాలను ముందుగానే సమర్పించాల్సి రావడం, స్థానికతను గుర్తించేందుకు బోనఫైడ్ సర్టిఫికె ట్లే కొలమానం కావడంతో వీటి కోసం నిరుద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు.
TSPSC Group 1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ఇంటర్వ్యూల రద్దు నేపథ్యంలో కీలక మార్పు!
అభ్యర్థులకు ఊరట...
ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకొంది. వన్టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో సర్టిఫికెట్ల అప్డేషన్ తప్పనిసరి కాదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు వెబ్సైట్లో మార్పులు కూడా చేసింది. ఓటీఆర్లో విద్యార్హత వివరాలు నమోదు చేస్తే సరిపోతుందని.. సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం అభ్యర్థుల ఇష్టమని తెలిపింది. సర్టిఫికెట్ అప్లోడ్ చేయకున్నా.. ఓటీఆర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుందని స్పష్టం చేసింది. దీనిపై నిరుద్యోగల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. అయితే ఉద్యోగంలో చేరే సమయంలో ఒరిజినల్స్ చూపించాల్సి ఉంటుంది.
ISRO Recruitment: ఇస్రోలో ఉద్యోగ అవకాశాలు.. అర్హతలు అప్లికేషన్ విధానం..
కొత్తగా ప్రిపరేషన్ బుక్స్..
చాలా కాలంగా పరీక్షలు లేకపోవడం.. ప్రభుత్వం వెంటనే ఖాళీల భర్తీకి ముందుకు రావడంతో మార్కెట్ (Market) లో పుస్తకాల కొరత ఏర్పాడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ, పోటీ పరీక్షల నేపథ్యంలో కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలుగు అకాడమీ కసరత్తు చేస్తున్నది. డిమాండ్ ఉన్న 15 రకాల పుస్తకాల పునర్ముద్రణకు చర్యలు చేపట్టింది. ప్రతి ఏటా రూ.20 కోట్లకుపైగా వెచ్చించి తెలుగు అకాడమీ పుస్తకాలను ముద్రిస్తుండగా, ఈ సారి అదనంగా రూ. 5 నుంచి 10 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Job Meal: విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ మేళా.. ముందుగానే అప్లై చేసుకోవాలి
ముఖ్యంగా ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్ -1, గ్రూప్ – 2, పోలీసు, టీచర్ ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం ఉంది. వారంతా తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలనే ఎంపిక చేసుకొంటారు. ఈ పుస్తకాలనే ప్రశ్నపత్రాల రూపకల్పనకు ప్రామాణికంగా తీసుకొంటారన్న అభిప్రాయం అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో నెలాఖరులోగా పుస్తకాలను అందుబాటులో తీసుకురావాలని అధికారులు కృషి చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, Telangana government jobs, Ts jobs, TSPSC