ఎట్టకేలకు తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. గత కొన్ని రోజులుగా న్యాయపరమైన అడ్డంకులు రావడంతో ఫలితాల విడుదల సాధ్యం కాలేదు. అయితే.. ఫలితాల విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేసి తాజాగా ఆ జాబితాను విడుదల చేశారు. ఒక్క పోస్టుకు రిజర్వేషన్ ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేశారు. 503 పోస్టులకు మొత్తం 25,050 మందిని ఎంపిక చేశారు. వెబ్ నోట్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. జాబితా కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. జూన్ లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో 503 గ్రూప్-1 ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను అక్టోబర్ 16న నిర్వహించింది. నవంబర్ 15న తుది కీని సైతం విడుదల చేసింది. అయితే.. రిజర్వేషన్ల విషయంలో కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లిన కారణంగా కొన్నాళ్లు గందరగోళం ఏర్పడింది.
అనంతరం ఓ అభ్యర్థి స్థానికత అంశంపై కోర్టుకు వెళ్లడంతో మరికొన్ని రోజులు ఫలితాల విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే.. హైకోర్టు తాజాగా ఫలితాలను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఒక్క అభ్యర్థి విషయంలో దాదాపు లక్షల మంది అభ్యర్థులకు సంబంధించిన రిజల్ట్స్ ను ఆపడం సరికాదని అభిప్రాయపడింది. దీంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమైంది.
మొత్తం 503 ఖాళీల కోసం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు మొత్తం 2,86,051 మంది హాజరయ్యారు. అందులో బబ్లింగ్, ఇతర నిబంధనలు పాటించని 135 మందిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కకు పెట్టింది. ఇంకా.. మిగిలిన 2,85,916 మంది అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయగా.. వీటిలో 25,050 మందిని మెయిన్స్ కు ఎంపిక చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Group 1, JOBS, TSPSC, Tspsc jobs