హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్ష తేదీల వివ‌రాలు

TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్ష తేదీల వివ‌రాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS EAMCET 2022 | తెలంగాణ ఎంసెట్ - 2022 నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఇంట‌ర్ అనంత‌రం ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, మెడిక‌ల్ కోర్సులో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఈ ప‌రీక్ష‌ను జేఎన్‌టీయూ (హైద‌రాబాద్‌) నిర్వహిస్తుంది. నోటిఫికేషన్ కు సంబంధించి వివరాలు..

ఇంకా చదవండి ...

తెలంగాణ (Telangana)  ఎంసెట్ - 2022 నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఇంట‌ర్ అనంత‌రం ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, మెడిక‌ల్ కోర్సులో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఈ ప‌రీక్ష‌ను జేఎన్‌టీయూ (హైద‌రాబాద్‌) నిర్వహిస్తుంది. టెక్నాలజీ, ఇంజ‌నీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాలు పొంద‌డానికి అభ్య‌ర్థులు మ్యాథ‌మెటిక్స్‌, కెమిస్ట్రీ/ బ‌యోటెక్నాల‌జీ/ బ‌యోల‌జీ స‌బ్జెక్టుల్లో ఇంజ‌నీరింగ్ చేసి ఉండాలి/ ఆప్ష‌న‌ల్, ఒకేష‌న‌ల్ కోర్సుల ఉత్తీర్ణ‌త / డిప్ల‌మా చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువ‌తున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నట్టు సమాచారం.

ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు స్వీకరించిన అనంతరం అగ్రిక‌ల్చ‌ర్, మెడిక‌ల్ పరీక్షను జూలై 14, 15వ తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షను జూలై  18, 19, 20వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. ఎంసెంట్ ద‌ర‌ఖాస్తుల‌కు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 400, మిగ‌తా కేట‌గిరిల అభ్య‌ర్థులు రూ. 800 చెల్లించారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఇంజినీరింగ్, మెడిక‌ల్ ప్ర‌వేశ ప‌రీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 800, మిగ‌తా కేట‌గిరిల అభ్య‌ర్థులు రూ. 1600 చెల్లించి, ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని నోటిఫికేష‌న్‌లో వెల్ల‌డించారు.

నోటిఫికేష‌న్ స‌మాచారం, ద‌ర‌ఖాస్తు విధానం గురించి తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్‌ https://eamcet.tsche.ac.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

First published:

Tags: Career and Courses, EDUCATION, Higher education, Telangana

ఉత్తమ కథలు