హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana 10th Class: తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ..

Telangana 10th Class: తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కరోనా మహమ్మారి కారణంగా 2020 నుంచి విద్యావ్యవస్థ అంతా చిన్నాబిన్నం అయిపోయింది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. మరి కొంత మది కరోనా ప్రభావంతో ప్రాణాలు కోల్పోయారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కరోనా(Corona) మహమ్మారి కారణంగా 2020 నుంచి విద్యావ్యవస్థ అంతా చిన్నాబిన్నం అయిపోయింది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. మరి కొంత మది కరోనా ప్రభావంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ కరోనా ప్రభావం అన్ని రంగాల్లో ఉన్నా.. విద్యారంగంలో ఎక్కువగా ఉందనే చెప్పాలి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులు(Teachers) ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంతే కాకుండా.. విద్యార్థులు కూడా ఆన్ లైన్ క్లాస్ లతో నానా పాట్లు పడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) పదో తరగతి విద్యార్థులకు నిర్వహించే పరీక్షల్లో మార్పులు చేసింది. గత రెండు సంవత్సరాల నుంచి కూడా మొత్తం 11 పేపర్లకు బదులు 6 పేపర్లుగా కుదించింది. ప్రత్యక్ష తరగతులు(Direct Classes) సాధ్యం కాకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.


కానీ ఈ సారి అలాంటి పరిస్థితులు కనపిపిచడం లేదు. కరోనా వ్యప్తి కూడా అంతగా లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కంటే ముందు పదో తరగతి పరీక్షలకు ఎన్ని పేపర్లు అయితే ఉంటాయే.. అవే పేపర్లను ఈ సారి పరీక్షలకు ఉంటాయాని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.

Prelims Result 2022: ఆ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ను ఇలా చెక్ చేసుకోండి..


హిందీ సబ్జెక్టుకు తప్ప.. మిగతా 5 సెబ్జెక్టులకు రెండు పేపర్లు ఉంటాయని పేర్కొంది. పాత విధానాన్నే అమలు చేయనుండగా.. సిలబస్ లో కూడా ఎలాంటి కుదింపు ఉండదని పేర్కొంది. ప్రభుత్వం నుంచి కూడా సిలబస్ ను తగ్గించాలనే ఆదేశాలు కూడా రాలేదని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి నుంచి డీఈఓలకు, ఉపాధ్యాయులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ కాలేదు.
Railway Jobs 2022: ఇంటర్ , డిగ్రీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ఇదిలా ఉండగా.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్ల సర్వీసులను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ సంవత్సరం జూన్ 15 నుంచే వీరి విధులను కొనసాగిస్తున్నట్లు ఆ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. దీని ద్వారా మొత్తం 1654 మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోద ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు.

First published:

Tags: Career and Courses, JOBS, Jobs in telangana, Students

ఉత్తమ కథలు