సేకరణ: శ్రీనివాస్. పి, కరీంనగర్
రచయిత: జి.రవళి, ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్, కరీంనగర్
గత రెండు సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో విద్యార్థులకు , ఆన్లైన్ క్లాసులు ఎక్కువగా నడిచాయి.. గత కొద్ది రోజులుగా కోవిద్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ సంస్కృతం మోడల్ పేపర్ లో ఇంటర్మీడియట్ బోర్డు 70 శాతం సిలబస్ నివ్వడం మాత్రమే ఇస్తారు. ప్రస్తుతం ఇస్తున్న మోడల్ పేపర్ ఆధారంగా మీరు ఏ విభాగాలు ఎంత చదవాలో అంచనాకు రాగులుగుతారు. దీని ద్వార మంచి స్కోర్ సాధించడానికి ఈ మోడల్ పేపర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ మోడల్ పేపర్లో మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షనులు - ఏ, బి, సి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష సంస్కృత ప్రశ్న పత్రంలో
- మొదటి బిట్ లో మూడు శ్లోకాలు ఇస్తారు. ఇందులో ఏదేని ఒక శ్లోకానికి ప్రతిపదార్థ్యం రాయమంటారు. వీటికి 1 × 6 = 6 మార్కులు కేటాయిస్తారు.
- రెండవ బిట్ ( II ) నందు 3 వ్యాస - ఇంటర్ బోర్డు రూప సమాధాన ప్రశ్నలు ఇచ్చి ఏదేని ఒక ప్రశ్నకు సమాధానం రాయమందురు . దీనికి 1x6 = 6 మార్కులు కేటాయించబడినవి . 3 వ బిట్టు లో గద్యభాగం ప్రశ్నలు ఇచ్చి ఏదేని నుండి 3 వ్యాసరూప ఒక ప్రశ్నకు సమాధానం మార్కులు రాయమంటారు. దీనికి 1x6 = 6
4 వ బిట్టు ఉప వాచకం నుండి 4 ప్రశ్నలు ఇచ్చి ఏదేని రెండు . ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు. ఒక ప్రశ్నకు 4 మార్కులు అనగా ఈ బిట్టుకు 2X4 = 8 మార్కులు కేటాయించబడినవి .
ప్రశ్న పత్రంలోని 5వ వ బిట్ నందు ఆ పత్రలేఖనానికి గాను 3 ప్రశ్నలలో ఏదేని ఒక సమాధానం రాయాలి . దీనికి 1x5 = 5 మార్కులు కేటాయిస్తారు. .
ప్రశ్న పత్రంలోని Xll , XIIl బిట్లు సంధులకు సంబంధించినది . XII వ బిట్టులో 12 పదాలు ఇచ్చి వాటిలో , ఏవేని నాలుగు పదాలు విడదీసి సంధిపేరు రాయాల్సి ఉంటుంది . దీనికి గాను 2x4=8 మార్కులు కేటాయిస్తారు.
XIII బిట్ నందు 12 పదాలువిడదీసి ఇచ్చి వాటిలో నాలుగు పదాలు కలిపి రాసి , 20 సంధిపేరు రాయమందురు . దీనికి గాను 2X4 = 8 మార్కులు కేటాయిస్తారు.
ప్రశ్నపత్రంలోని XVI వ బిట్ నందు ఐదు అశుద్ధమైన వాక్యాలు ఇచ్చి వాటిని 5 సరిచేసి రాయమందురు . దీనికి గాను మార్కులు కేటాయించబడినవి .
మొదటి బిట్ కొరకు పద్యభాగంలోని 3,4 పాఠాలలో ఏదేని ఒక పాఠంలోని నాలుగు శ్లోకాలకు ప్రతిపదార్థం నేర్చుకొన్నచో 6 మార్కులు , రెండవ బిట్ కొరకు పద్యభాగం లోని 2,6 పాఠాలలో ఏదేని ఒక పాఠంలోని వ్యాసరూప సమాధాన ప్రశ్న నేర్చుకున్నటైతే 6 మార్కులు , మూడవ బిట్ కొరకు గద్యభాగంలో 2'5 ఏదేని ఒక పాఠం నేర్చుకున్న ట్లైతే 6మార్కులు నాల్గవ బిట్ కొరకు ఉపవాచకంలోని 1,3 పాఠాలలో ఏదేని ఒక ప్రశ్న చదివినట్లయితే 8 మార్కులు ఉంటాయి.
పదకొండవ బిట్ ( xl) కొరకు పాఠ్యపుస్తకం లోని మూడు పత్రాలలో ఏదేని ఒక పత్రం నేర్చుకున్నట్లైతే 5 మార్కులు ,Xll మరియు Xlll కొరకు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ఐదు సంధులలో ఏవేని నాలుగు సంధులు నేర్చు 16 మార్కులు , XVI వ బిట్ కొరకు పాఠ్య పుస్తకంలోని 15 వాక్యాలు నేర్చుకున్నట్లైతే 5 మార్కులు సులభంగా సాధించవచ్చు .
అయితే విద్యార్థులుఎక్కువగా పద్యభాగం లో విక్రమన్కస్య ఔదార్యo, గద్యభాగం లో గాత్ర వాత్సల్యం, అలాగే సాధు వర్ధనం అనే టాపిక్ ఎక్కువ చదువుతే 90 మార్కులు సాధించగలరని G రవళి. ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ కరీంనగర్, న్యూస్ 18తెలుగు తెలిపారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Intermediate exams, Telangana intermediate board exams