తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డ్ తాజాగా విడుదల చేసింది. విద్యార్థులు tsbie.cgg.gov.in లింక్ ద్వారా తమ ఫలితాలను నేరుగా చెక్ చేసుకోవచ్చు. గతంలో కరోనా నేపథ్యంలో మార్చిలో వాయిదా పడిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 4.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల విడుదల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేసింది.
విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది..
Step 1: విద్యార్థులు మొదటగా ఇంటర్ బోర్డ్ అధికారిక tsbie.cgg.gov.inను ఓపెన్ చేయాలి.
Step 2: హాల్ టికెట్ నంబర్ నమోదు చేయాలి.
3) అనంతరం ‘సబ్మిట్’ పై క్లిక్ చేయాలి
4)దీంతో స్క్రీన్ పై సబ్జెక్టుల వారీగా మీ రిజల్ట్ కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం మీ రిజల్ట్స్ షీట్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
TS Inter Results 2021: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... మార్క్స్ మెమో ఇలా డౌన్లోడ్ చేయండి
మీ మార్కులు తక్కువగా వచ్చాయని మీరు భావిస్తే రీ కౌంటింగ్ తో పాటు రీ వాల్యుయేషన్ కు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇంటర్ బోర్డు మీకు కల్పిస్తుంది.
అత్యంత తక్కువ ఉత్తీర్ణత శాతం..
ఇంటర్ జనరల్ విభాగంలో మొత్తం 4,09,991 మంది పరీక్షలకు హాజరవ్వగా కేవలం 1,99,756 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఒకేషనల్ విభాగంలో 49, 331 మంది పరీక్షకు హాజరవ్వగా కేవలం 24,226 మంది మాత్రమే పాస్ అయ్యారు. జనరల్ లో 49 శాతం, ఒకేషనల్ లో కూడా 49 శాతం మాత్రమే పాస్ అయ్యారు. జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 4,59,242 మంది పరీక్షకు హాజరవ్వగా 2,24,012 మంది మాత్రమే పాస్ అయ్యారు. మొత్తం పాసైన వారి శాతం 49 శాతం మాత్రమే నమోదైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.