హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Budget 2022-23: తెలంగాణ బడ్జెట్లో విద్యారంగంపై వరాల జల్లు.. 7 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం.. వివరాలివే

TS Budget 2022-23: తెలంగాణ బడ్జెట్లో విద్యారంగంపై వరాల జల్లు.. 7 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం.. వివరాలివే

హరీశ్​ రావు (ఫైల్​)

హరీశ్​ రావు (ఫైల్​)

తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ బడ్జెట్లో విద్యారంగానికి సంబంధించి కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) ఈ రోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను (Telangana Budget) ప్రవేశపెట్టారు. రూ.2.56 లక్షల కోట్లు తో ఆయన బడ్జెట్ ను ఆయన శాసనససభలో సమర్పించారు. అయితే, త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్లో వివిధ వర్గాలపై వరాల వర్షం కురిపించారు. విద్యారంగానికి ముఖ్యంగా విద్యార్థుల (Students) సంక్షేమానికి భారీగా కేటాయింపులు జరిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి భారీగా కేటాయింపులు చేసింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయలతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ది పనులను ప్రభుత్వం చేపడుతున్నట్లు ప్రకటించింది సర్కార్. మొదటి దశలో మండలాన్ని యూనిట్ గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

- ఇంకా రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేసీఆర్ సర్కార్. ఇందు కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. వంద కోట్లను ప్రతిపాదించింది.

Telangana Budget : తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 56 వేల కోట్లు.. దేనికి ఎంతంటే...

- ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఈ బడ్జెట్‌లో రూ. 100 కోట్లను కేటాయించారు.

University Grants Commission: జాతీయ విద్యావిధానంలో భాగంగా.. కీలక చర్యలు చేపడుతున్న యూజీసీ.. వివరాలిలా..

-రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రానున్న రెండేళ్ల‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, వికారాబాద్‌, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

-2023లో మిగతా ఎనిమిది జిల్లాలు మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, వరంగల్‌, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నూతన మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ఈ బడ్జెట్‌లో రూ.1000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.


-రాష్ట్ర వ్యాప్తంగా అన్నిప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్‌ కాలేజీల్లో 7 నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్ ను పంపిణీ చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఏడు లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరనుంది.

-ఇంకా ఉపకారవేతనాలకు రూ.4688 కోట్లను కేటాయించింది ప్రభుత్వం.

First published:

Tags: Harish Rao, Telangana, Telangana Budget

ఉత్తమ కథలు