హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులకు సిట్ నోటీసులు

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులకు సిట్ నోటీసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TSPSC Paper Leak: TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేయగా..100 మందిని పైగా విచారించారు. అలాగే రూ.4 లక్షలను సీజ్ చేశారు. ఇక  తాజాగా సిట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

TSPSC Paper Leak: TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేయగా..100 మందిని పైగా విచారించారు. అలాగే రూ.4 లక్షలను సీజ్ చేశారు. ఇక  తాజాగా సిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. TSPSC బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు ఏడుగురు సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. వీరిని విచారణ నిమిత్తం హాజరు కావాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో వీరి బాధ్యతలు ఏంటి? ప్రశ్నపత్రాల రూపకల్పనలో వీరి పాత్ర ఎంత వరకు ఉంటుంది? అలాగే కంప్యూటర్లకు సంబంధించి యాక్సెస్ వీరికి ఉంటుందా? లేదా? ఇలా అనేక అంశాలపై వివరాలు తెలుసుకోనున్నారు.

కాగా ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ప్రవీణ్, అలాగే రమేష్ కమీషన్ లో పని చేసే వారి దగ్గర పీఏలుగా పని చేస్తున్నట్లు సిట్ గుర్తించింది. ప్రస్తుతం రమేష్, షమీమ్, సురేష్ సిట్ కస్టడీలో ఉన్నారు. అయితే ఈ కేసులో చైర్మన్ కు, సభ్యులకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వీరందరిని టిఎస్పిఎస్సి కార్యాలయంలో విచారిస్తారా?లేక సిట్ కార్యాలయానికి రమ్మని అక్కడ విచారిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే వీరి విచారణ తేదీలపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు.

తీగ లాగితే డొంక కదిలిన చందాన టిఎస్పిఎస్సి పేపర్ లీక్ వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. మొదట ఈ కేసు దర్యాప్తును బేగంబజార్ పోలీసులు మొదలుపెటగా..ఆ తర్వాత సిట్ (Special Investigation Team) చేతుల్లోకి వెళ్ళింది. సిట్ విచారణలో ఇప్పటికే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇప్పటివరకు ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక అలాగే ఆమె భర్తతో సహా 15 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో రమేష్, షమీమ్, సురేష్ లను 3 రోజులుగా సిట్ విచారిస్తుంది. ఈ విచారణలో అనేక విషయాలపై సిట్ అధికారులు ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తుంది.

TSPSC Paper Leak: పొలం తాకట్టు పెట్టి ఏఈ పేపర్ కొని..సిట్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు..

కాగా కమీషన్ కార్యాలయంలో పని చేస్తున్న ప్రవీణ్, రాజశేఖర్ గ్రూప్ 1 పేపర్ లీక్ చేయగా..ఆ విషయం ఇటీవల బయటకు వచ్చిందని..అంతవరకు ఎవరికీ తెలియదని అంతా భావించారు. కానీ సిట్ దర్యాప్తులో దీనికి సంబంధించి కీలక విషయాలు బయటకొచ్చాయి. ప్రశ్నపత్రాల లీక్ విషయం టిఎస్పిఎస్సి కమీషన్ కార్యాలయంలో పని చేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగులకు ముందే తెలుసని అధికారులు నిర్ధారించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ లు ముందే గుర్తించారు.

Big Breaking: రద్దైన పరీక్షల తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. పూర్తి వివరాలివే

అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్, రాజశేఖర్ ప్రశ్నపత్రాల లీకేజి అంశం ఉన్నతాధికారులకు చెబుతారేమో అని భయపడ్డారు. ఈ క్రమంలో షమీమ్,ర్ రమేష్ లను ప్రలోభపెట్టారు. మీకు కూడా గ్రూప్ 1 పేపర్ ఇస్తామని..మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం సాధించుకోవచ్చని ప్రవీణ్, రాజశేఖర్ చెప్పుకొచ్చారు. దీనితో ఆ విషయం ఎవరికీ చెప్పకుండా గ్రూప్ 1 పేపర్ తీసుకున్నారు. కాగా షమీమ్, రమేష్ ల నుండే న్యూజిలాండ్ లో ఉన్న ప్రశాంత్ కు, సైదాబాద్ కు చెందిన సురేష్ కు పేపర్ లీక్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురిని ఇప్పటికే కోర్టు 5 రోజుల సిట్ కస్టడీకి అనుమతి ఇవ్వగా మూడు రోజులు పూర్తయ్యాయి.

TSPSC పేపర్ లీక్ కేసులో కీలక పురోగతి..మరో వ్యక్తి అరెస్ట్..!

పేపర్ లీక్ తో రేణుక భర్త డాక్వా నాయక్ డబ్బుల వసూలులో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. ఏఈ పేపర్ లీక్ తో డాక్వా నాయక్ ఏకంగా రూ.25 లక్షలను వసూలు చేసినట్టు గుర్తించారు. నీలేష్, గోపాల్ నాయక్ లు పొలం తాకట్టు పెట్టి రూ.13.5 లక్షలను డాక్వా నాయక్ కు అందించినట్లు సిట్ గుర్తించింది. అలాగే రాజేందర్ అనే యువకుడు కూడా రూ.5 లక్షలు, శ్రీకాంత్ అనే వ్యక్తి రూ.7.5 లక్షలను డాక్వా నాయక్ కు ఇచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నారని సిట్ తెలిపింది. మరి రానున్న రోజుల్లో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

First published:

Tags: JOBS, Telangana, Telangana government jobs, TSPSC, TSPSC Paper Leak

ఉత్తమ కథలు