హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC పేపర్ లీక్ కేసులో కీలక మలుపు..ఆ 42 మందికి సిట్ నోటీసులు!

TSPSC పేపర్ లీక్ కేసులో కీలక మలుపు..ఆ 42 మందికి సిట్ నోటీసులు!

పేపర్ లీక్ కేసులో కీలక మలుపు

పేపర్ లీక్ కేసులో కీలక మలుపు

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు TSPSCలో పని చేసే 42 మందికి నోటీసులు ఇచ్చారు. ప్రవీణ్, రాజశేఖర్ తో సన్నిహితంగా ఉన్న వారందరిని సిట్ విచారించనున్నట్లు తెలుస్తుంది. ఔట్ సోర్సింగ్ లో పని చేసే ఐటీ సిబ్బందికి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. అలాగే కాన్ఫిడెన్షియల్ రూం ఇంఛార్జి శంకర్ లక్ష్మిని కూడా అధికారులు లోతుగా విచారిస్తున్నారు. రేపు మరోసారి ఆమె స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేయనున్నారు.

TSPSC పేపర్ లీక్ కేసులో తొలి వేటు..ఆ ఇద్దరి ఉద్యోగాలు తొలగింపు!

కోచింగ్ సెంటర్ నిర్వాహకులతో టచ్ లో రేణుక..

ఇప్పటివరకు కమీషన్ లో పని చేసే ప్రవీణ్ ఒక్కడే గ్రూప్ 1 పరీక్ష రాశాడని తేలగా తాజాగా మరో 10 మంది కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయినట్లు తెలుస్తుంది. ఇందులో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తెలుస్తుంది. ఈ క్రమంలో పరీక్ష రాసిన వారిని కూడా విచారించాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న రేణుక ఆమె భర్త డాక్వా నాయక్ కు కోచింగ్ సెంటర్ నిర్వాహకులతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో అభ్యర్థులను కూడా సిట్ విచారించేందుకు సిద్దమయింది. ఇక మరో నిందితుడు రాజశేఖర్ ఫ్రెండ్ రమేష్ పాత్రపై అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయి. దీనితో రమేష్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ లో కొత్త లింకులు..వాట్సప్ చాట్ ఆధారంగా కూపీ లాగుతున్న సిట్

పేపర్ లీక్ లో తొలి వేటు..

పేపర్ లీక్ లో కేసులో అధికారులు తొలి వేటు వేశారు. పేపర్ లీక్ లో రేణుక, ఆమె భర్త ప్రమేయం ఉండడంతో వారిద్దరిని ఉద్యోగాల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం బాలికల గురుకుల పాఠశాలలో రేణుక హిందీ టీచర్ గా పని చేస్తుంది. అలాగే ఆమె భర్త డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపిడివో ఆఫీస్ లో ఉపాధి హామీ స్కీమ్ టెక్నీకల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. మరి రానున్న రోజుల్లో ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

మరికొన్ని రోజుల్లోనే కొలిక్కి..

ఇకపోతే కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు ప్రధాన నిందితులైన ప్రవీణ్, రేణుక, రాజశేఖర్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. అలాగే వారి కుటుంబసభ్యులు, స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సోదాల్లో పలు ప్రశ్నాపత్రాలు, పెన్ డ్రైవ్ లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక నిందితుల ఫోన్ చాట్, వాట్సప్ హిస్టరీ, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మరికొన్ని రోజుల్లో ఈ కేసును ఓ కొలిక్కి తీసుకొస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు.

First published:

Tags: Crime, JOBS, Telangana, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు