స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగాల జాతరకు తెరతీసింది. ఏకంగా 8500 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. దేశంలోని వేర్వేరు జోన్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టులు ఉన్నాయి. ఇవి మూడేళ్ల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. వీరిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులుగా గుర్తించరు. ఎంపికైనవారికి మూడేళ్లు ట్రైనింగ్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇప్పటికే డిగ్రీ అర్హతతో 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 డిసెంబర్ 4 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఇప్పుడు 8500 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్బీఐ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 10 చివరి తేదీ. 2021 జనవరిలో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను https://sbi.co.in/ వెబ్సైట్లో Careers సెక్షన్లో తెలుసుకోవచ్చు.
IOCL Jobs 2020: ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత ఐఓసీఎల్లో 482 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్లో 120 జాబ్స్... 3 రోజుల్లో అప్లై చేయండి
మొత్తం ఖాళీలు- 8500
తెలంగాణ- 460 (ఆదిలాబాద్ -10, భద్రాద్రి కొత్తగూడెం -21, జగిత్యాల -9, జనగాం -10, జయశంకర్ -12, జోగులంబా -9, కామారెడ్డి -16, కరీంనగర్ - 14, ఖమ్మం - 24, కొమరంభీమ్ -7, మహాబూబాబాద్ -12, మహబూబ్నగర్ -33, మల్కాజ్గిరి -5, మంచిర్యాల -8, మెదక్ -14, నాగర్కూర్నూల్ -15, నల్గొండ -22, నిర్మల్ -11,
నిజామాబాద్ -39, పెద్దపల్లి -10, రంగారెడ్డి -22, సంగారెడ్డి -20, సిద్దిపేట -17, సిరిసిల్ల -6, సూర్యపేట -28, వికారాబాద్ -23, వనపర్తి -12, వరంగల్ -4, వరంగల్ రూరల్-11, యాదాద్రి భువనగిరి -16)
ఆంధ్రప్రదేశ్- 620 (శ్రీకాకళం- 33, విజయనగరం- 29, విశాఖపట్నం- 44, తూర్పుగోదావరి- 62, పశ్చిమ గోదావరి- 75, కృష్ణా- 53, గుంటూరు- 75, ప్రకాశం- 47, నెల్లూరు- 37, చిత్తూరు- 43, కడప- 51, అనంతపూర్- 28, కర్నూలు- 43)
గుజరాత్- 482
కర్నాటక- 600
మధ్యప్రదేశ్- 430
చత్తీస్గఢ్- 90
పశ్చిమ బెంగాల్- 480
ఒడిశా- 400
హిమాచల్ ప్రదేశ్- 130
హర్యానా- 162
పంజాబ్- 260
తమిళనాడు- 470
పాండిచ్చెరి- 6
ఢిల్లీ- 7
ఉత్తరాఖండ్- 269
రాజస్తాన్- 720
కేరళ- 141
ఉత్తర ప్రదేశ్- 1206
మహారాష్ట్ర- 644
అరుణాచల్ ప్రదేశ్- 25
అస్సాం- 90
మణిపూర్- 12
మేఘాలయ- 40
మిజోరం- 18
నాగాలాండ్- 35
త్రిపుర- 30
బీహార్- 475
జార్ఖండ్- 200
IBPS SO Recruitment 2020: ప్రభుత్వ బ్యాంకుల్లో డిగ్రీ అర్హతతో 647 ఉద్యోగాలు... నవంబర్ 23 లాస్ట్ డేట్
DRDO Scholarship: విద్యార్థులకు రూ.1,86,000 స్కాలర్షిప్... దరఖాస్తుకు డిసెంబర్ 31 వరకు గడువు
నోటిఫికేషన్ విడుదల- 2020 నవంబర్ 20
దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 10
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2020 డిసెంబర్ 10
ఆన్లైన్ ఫీజు పీమెంట్- 2020 నవంబర్ 20 నుంచి డిసెంబర్ 10
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 డిసెంబర్ 25
ఎస్బీఐ అప్రెంటీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎస్బీఐ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్హతలు- 2020 అక్టోబర్ 31 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు- 2020 అక్టోబర్ 31 నాటికి 20 నుంచి 28 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- రాతపరీక్ష, స్థానిక భాషలో పరీక్ష.
స్టైపెండ్- మొదటి ఏడాది నెలకు రూ.15,000. రెండో ఏడాది నెలకు రూ.16,500. మూడో ఏడాది నెలకు రూ.19,000. ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ ఉండవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Bank, Banking, Banks, Breaking news, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Sbi, State bank of india, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu