హోమ్ /వార్తలు /jobs /

RRB NTPC: ఆర్​ఆర్​బీ NTPC అభ్యర్థులకు అలర్ట్.. ఆ రోజే రివైజ్డ్ రిజల్ట్.. పెరగనున్న అర్హుల జాబితా..

RRB NTPC: ఆర్​ఆర్​బీ NTPC అభ్యర్థులకు అలర్ట్.. ఆ రోజే రివైజ్డ్ రిజల్ట్.. పెరగనున్న అర్హుల జాబితా..

ఇటీవల విడుదలైన ఆర్‌ఆర్‌బి ఎన్‌టీపీసీ, గ్రూప్ డి ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తిన ఫిర్యాదులను పరిశీలించేందుకు భారతీయ రైల్వే కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కమిటీ తన తుది నివేదికను రైల్వే శాఖకు సమర్పించింది.

ఇటీవల విడుదలైన ఆర్‌ఆర్‌బి ఎన్‌టీపీసీ, గ్రూప్ డి ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తిన ఫిర్యాదులను పరిశీలించేందుకు భారతీయ రైల్వే కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కమిటీ తన తుది నివేదికను రైల్వే శాఖకు సమర్పించింది.

ఇటీవల విడుదలైన ఆర్‌ఆర్‌బి ఎన్‌టీపీసీ, గ్రూప్ డి ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తిన ఫిర్యాదులను పరిశీలించేందుకు భారతీయ రైల్వే కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కమిటీ తన తుది నివేదికను రైల్వే శాఖకు సమర్పించింది.

    ఇటీవల విడుదలైన ఆర్‌ఆర్‌బి ఎన్‌టీపీసీ(NTPC), గ్రూప్ డి(Group D) ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తిన ఫిర్యాదులను పరిశీలించేందుకు భారతీయ రైల్వే కమిటీ(Indian Railway Committee) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కమిటీ తన తుది నివేదికను రైల్వే శాఖకు సమర్పించింది. కమిటీ నివేదిక ప్రకారం, ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ మొత్తం ఖాళీల్లో ప్రతి ఖాళీకి 20 మంది చొప్పున అభ్యర్థులను సీబీటీ–2కి షార్ట్​లిస్ట్ చేసింది. ఇప్పటికే, షార్ట్​లిస్ట్ అయిన అభ్యర్థులు క్వాలిఫైడ్‌గా(Qualified) కొనసాగుతారని తెలిపింది. వీరితో పాటు కొత్తగా మరింత మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్(Short list) చేయనున్నట్లు తెలిపింది. ఈ అదనపు అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అంతకుముందు, ఆర్​ఆర్​బీ ఎన్​టీపీ సీబీటీ–2 పరీక్షకు మొత్తం 7 లక్షల మంది అభ్యర్థులు ఎంపికైనట్లు బోర్డు ప్రకటించింది. అయితే, 7 లక్షల అభ్యర్థులకు బదులుగా 7 లక్షల రోల్ నంబర్‌లను బోర్డు ఎంపిక చేసిందని అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపారు.

    Telangana Jobs: నిరుద్యోగులకు మరో శుభవార్త.. పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్

    ఈ విధానం ద్వారా ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైతే ఇతరులకు అవకాశాలను తగ్గిస్తుందని వాపోయారు. దీనిపై బీహార్​, ఉత్తరప్రదేశ్​లో పలు చోట్ల ఆందోళనలు కూడా జరిగాయి. కొంత మంది నిరసనకారులు బీహార్​లో ఓ రైలు బోగీకి నిప్పుపెట్టారు. దీంతో, అభ్యర్థుల ఆందోళనకు దొగొచ్చిన రైల్వే బోర్డు ఎన్​టీపీసీ ఫలితాలపై కమిటీని నియమించింది.

    ఈ కమిటీ ఎట్టకేలకు నివేదికను సమర్పించింది. “ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ సీబీటీ–2 పరీక్షలో ఒకే పే లెవల్​ పోస్టులకు పోటీపడే అభ్యర్థులందరికీ ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహిస్తాం. ఇది నార్మలైజేషన్ సమస్యను తొలగిస్తుంది. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల సింగిల్​ షిఫ్ట్​ సాధ్యం కాని చోట, పర్సంటైల్ ఆధారిత నార్మలైజేషన్ విధానాన్ని అనుసరిస్తాం.”అని తాజా నోటీసులో పేర్కొంది.

    Telangana Govt Jobs: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి... ఇలా రిజిస్టర్ చేసుకోండి

    ఏప్రిల్ మొదటి వారంలో సీబీటీ–1 సవరించిన ఫలితాలు..​

    ఇంకా, ఎన్​టీపీసీ సీబీటీ–1కు సంబంధించి అన్ని పే లెవర్స్​లో సవరించిన ఫలితాలను ఏప్రిల్ మొదటి వారంలోగా అంటే ఏప్రిల్ 7 వ తేదీలోపు విడుదల చేయనున్నట్లు ఆర్​ఆర్​బీ ప్రకటించింది. లెవల్-1 పోస్టులకు సంబంధించిన సీబీటీ–2ని జూలై నుంచి నిర్వహించాలని ఆర్​ఆర్​బీ యోచిస్తోంది. పే లెవల్ 6 కోసం 2వ దశ సీబీటీ పరీక్షను మేలో నిర్వహించనుంది.

    Telangana Govt Jobs: తెలంగాణలోని ఉద్యోగాలకు అన్ని నోటిఫికేషన్స్ ఒకేసారి వస్తాయా? రిజర్వేషన్ రూల్స్ ఏంటీ? తెలుసుకోండి

    ఇతర పే స్కేల్​లో గల పోస్టులను ఆ తర్వాతి నెలల్లో నిర్వహించనుంది. ఒకే పే లెవల్​ గల అభ్యర్థులకు సింగిల్​ షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించనున్నందున.. ఎక్కువ పరీక్షా కేంద్రాల అవసరం ఏర్పడుతుంది. తద్వారా అదనపు మౌలిక సదుపాయాలు, వసతులు ఏర్పాట్లపై ఆర్​ఆర్​బీ దృష్టి సారించింది. ఎన్​టీపీసీ సీబీటీ–2 పరీక్షను వీలైనంత త్వరగా నిర్వహించేందుకు ఆర్​ఆర్​బీ ఏర్పాట్లు చేస్తుంది.

    First published:

    ఉత్తమ కథలు