సార్వత్రిక ఎన్నికల్లో సమీపిస్తున్నవేళ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేపట్టారు నేతలు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ యువతను అట్రాక్ట్ చేసే విధంగా యోచనలు చేసింది. ఈ ఎన్నికల్లో తాము గెలిస్తే కేంద్ర ప్రభుత్వ పరీక్షల దరఖాస్తు రుసుము లేకుండా చేస్తామని పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రకటించారు. సోషల్ మీడియా ఫేస్బుక్ వేదికగా ‘కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం పెట్టే పరీక్షల దరఖాస్తు రుసుం ఎత్తివేస్తాం’ పోస్టు పెట్టారు.
తాజాగా ఎన్నికల మేనిఫెస్టోని విడుదలచేసిన కాంగ్రెస్ అందులోనూ నిరుద్యోగులు, పేదలను ఆకర్షించే ఎన్నో పథకాలను రూపొంచింది. ఖాళీగా ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేయడంతో పాటు.. ఉపాధి హామీ పనిదినాలు 150 రోజులకు పెంచుతామని హామి ఇచ్చింది. ఈ విధంగా సరికొత్త ప్రణాళికలతో ఓటర్లను ముఖ్యంగా యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5 State Elections, Andhra Pradesh Assembly Election 2019, AP Congress, Congress, Rahul Gandhi, TS Congress