హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

PM e-Vidya: ఉచితంగా ఆన్​లైన్ ఎడ్యుకేషన్​... అన్ని తరగతులకు వర్తింపు

PM e-Vidya: ఉచితంగా ఆన్​లైన్ ఎడ్యుకేషన్​... అన్ని తరగతులకు వర్తింపు

PM e-Vidya: ఉచితంగా ఆన్​లైన్ ఎడ్యుకేషన్​... అన్ని తరగతులకు వర్తింపు
(ప్రతీకాత్మక చిత్రం)

PM e-Vidya: ఉచితంగా ఆన్​లైన్ ఎడ్యుకేషన్​... అన్ని తరగతులకు వర్తింపు (ప్రతీకాత్మక చిత్రం)

PM e-Vidya | కేంద్ర ప్రభుత్వం పీఎం ఇ-విద్య కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

కరోనా వైరస్ ప్రభావం వల్ల లాక్​డౌన్ కొనసాగుతుండడంతో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. విద్యార్థులకు ఆఫ్​లైన్​ క్లాసులు జరగడం లేదు. దీంతో ప్రస్తుతం అంతా డిజిటల్ ఎడ్యుకేషన్ నడుస్తోంది. స్కూళ్లు, కాలేజీలు ఆన్​లైన్ ద్వారానే పాఠాలు బోధిస్తున్నాయి. కాగా ఆన్​లైన్ లెర్నింగ్​ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాదే పీఎం ఈ-విద్య (PM e-Vidya)ను ప్రారంభించింది. దీనిలో నాలుగు విభాగాలు ఉంటాయి. స్కూల్ ఎడ్యుకేషన్ కోసం నాలుగు, ఉన్నత విద్య కోసం రెండు విభాగాలు ఉన్నాయి. స్వయంప్రభ (Swayam Prabha) అధికారిక వెబ్​సైట్​లో ఈ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉంటాయి. కంటిచూపు లేని వారి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం... ప్రత్యేక రేడియో పోడ్​కాస్ట్ ద్వారా పీఎం ఈ-విద్యను నడిపిస్తోంది. అలాగే ఇంటర్నెంట్ సౌకర్యం లేని వారి కోసం టీవీ చానెల్ ద్వారా విద్యను అందిస్తోంది. పీఎం ఈ-విద్య పరిధిలోనే దీక్ష (DIKSHA), నిష్ట (NISHTHA) అనే రెండు పోర్టల్స్ కూడా ఉన్నాయి.

దీక్ష (DIKSHA) అంటే


దీక్ష ద్వారా ఎన్​సీఆర్​టీ, ఎన్​ఐఓఎస్​, సీబీఎస్​ఈ పుస్తకాలతో పాటు వాటికి సంబంధించిన టాపిక్స్​ను ఆన్​లైన్​ క్లాసెస్​ ద్వారా ఈ విభాగంలో బోధిస్తారు. యాప్​లోని క్యూఆర్​ కోడ్​ను స్కాన్ చేసి విద్యార్థులు పోర్టల్​లోని 2,685 కోర్సులను వినియోగించుకోవచ్చు. దీక్ష ప్రోగ్రాంలో ఇప్పటికే 8.46 మంది విద్యార్థులు ఎన్‌రోల్ అయి ఉన్నారు. ఈ దీక్ష పోర్టల్​లో మొత్తం 2,775 కోట్ల లెర్నింగ్ నిమిషాలు ఉన్నాయి.

UGC Online Courses: స్వయం పోర్టల్‌లో ఈ 123 యూజీ, పీజీ ఆన్‌లైన్ కోర్సులు ఉచితం

NIMHANS Recruitment 2021: నిమ్‌హాన్స్‌లో 275 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

నిష్ట (NISHTHA) అంటే


ది నేషనల్​ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్​ అండ్​ టీచర్స్​ హోలిస్టిక్​ అడ్వాన్స్​మెంట్ (NISHTHA) ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వం టీచర్లకు ట్రైనింగ్​ ఇస్తోంది. ఎలిమెంటరీ స్థాయిలో టీచింగ్​ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తెచ్చింది. 11 బాషల్లో ఇది అందుబాటులో ఉంది.

మెంటల్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్


లాక్​డౌన్ లాంటి క్లిష్టసమయాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మానసికంగా దృఢంగా ఉండేందుకు మనోదర్పన్ (Manodarpan) అనే పోర్టల్​ను కూడా పీఎం ఈ-విద్య కింద ప్రభుత్వం నిర్వహిస్తోంది. మానసికంగా ఏదైనా సమస్య అనిపిస్తే కౌన్సింలింగ్,​ గైడెన్స్ ఈ పోర్టల్ ద్వారా పొందవచ్చు. దీనిలో 308 లైవ్ సెషన్లు ఉంటాయి. అలాగే టీచర్ల కోసం ప్రత్యేకం మరో 45 లైన్ సెషన్లు ఉన్నాయి.

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

విద్య సంబంధిత వీడియోలను ప్రసారం చేసేందుకు పీఎం ఈ-విద్య.. టాటా స్కై, ఎయిర్​టెల్ లాంటి ప్రైవేటు డీటీహెచ్ ఆపరేటర్లతోనూ చేతులు కలిపింది. అలాగే ఈ-పాఠశాల పోర్టల్​లో 200 కొత్త టెక్ట్స్​ బుక్​లను యాడ్ చేసింది. సీఐఈటీ, ఎన్​సీఈఆర్​టీ డెవలప్​చేసిన ఈ విద్య పోర్టల్​/యాప్​ టీచర్లు, విద్యార్థులు, ఎడ్యుకేటర్స్​, తల్లిదండ్రులకు అన్ని రకాల టెక్ట్స్​బుక్స్​ను అందుబాటులోకి తెచ్చింది.

First published:

Tags: CAREER, Distance Education, EDUCATION, Online classes, Online Education

ఉత్తమ కథలు