ఇండియా (India)లో ఎక్కువ మంది విద్యార్థులు (Students) ఇంజనీరింగ్పై ఆసక్తి చూపుతారు. ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతారు. దేశంలోని ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలు పొందేందుకు జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్ జేఈఈ మెయిన్ రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం JEE Main- 2023 సెషన్-2కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జేఈఈ మెయిన్ సెషన్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ jeemain.nta.nic.in ద్వారా మార్చి 7లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
* అర్హత ప్రమాణాలు
జేఈఈ మెయిన్-2023కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ పాసై ఉండాలి. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్లో ఉన్న విద్యార్థులు JEE మెయిన్ 2023లో వారి స్కోర్ ఆధారంగా IIIT, NIT, కేంద్రీయ నిధులతో కూడిన సాంకేతిక సంస్థలు (CFTIs)లో అడ్మిషన్స్ పొందేందుకు అర్హులు.
* అప్లికేషన్ ప్రాసెస్
ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక పోర్టల్ jeemain-nta.nic.inను విజిట్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలోకి వెళ్లి, జేఈఈ మెయిన్ అప్లికేషన్ సెషన్-2 అనే లింక్పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి. ఆ తరువాత అప్లికేషన్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. ఆ తరువాత అప్లికేషన్ను క్రాస్-చెక్ చేసుకొని, ఫీజు చెల్లించండి. చివరగా భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోండి.
* ఏప్రిల్ 6 నుంచి సెషన్-2 పరీక్షలు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 6న ప్రారంభమై, ఏప్రిల్ 12న ముగియనున్నాయి. కాగా, జేఈఈ మెయిన్ సెషన్ -1 కోసం 8.6 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 8.22 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. సెషన్ -1 పరీక్షలు జనవరి 24 నుంచి జనవరి 31 మధ్య జరిగాయి. ఫలితాలు కూడా ఇటీవల వెల్లడయ్యాయి. జేఈఈ మెయిన్ సెషన్-1లో 20 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు.
* జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్
జేఈఈ మెయిన్లో టాప్ 2.5 లక్షలలోపు ర్యాంక్ సాధించిన అభ్యర్థులు ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హులు. జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభమవుతుంది. పరీక్షలు జూన్ 4న జరగనుంది.
* మొత్తం 13 భాషల్లో పరీక్ష
JEE మెయిన్-2023 సెషన్-2 పరీక్ష ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, కన్నడ, అస్సామీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ రెండు పేపర్లుగా ఉంటుంది. BTech/ BE కోర్సుల్లో ప్రవేశాలను పేపర్-1 ఆధారంగా చేపట్టనున్నారు. పేపర్-2 ద్వారా బ్యాచులర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్స్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JEE Main 2023, JOBS