NO STUDENT TO FAIL IN CLASS 10 TO 12 THIS TIME IN CBSE TERM 1 BOARD EXAMS AK GH
CBSE Term 1: సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్న్యూస్.. టర్మ్ 1 పరీక్షల్లో ఎవరినీ ఫెయిల్ చేయకూడదని బోర్డు నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పది, పన్నెండో తరగతి విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. టర్మ్ 1 పరీక్షల్లో ఏ ఒక్క విద్యార్థిని కూడా ఫెయిల్ చేయమని, కేవలం మార్కులు మాత్రమే కేటాయిస్తామని తెలిపింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పది, పన్నెండో తరగతి విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. టర్మ్ 1 పరీక్షల్లో ఏ ఒక్క విద్యార్థిని కూడా ఫెయిల్ చేయమని, కేవలం మార్కులు మాత్రమే కేటాయిస్తామని తెలిపింది. టర్మ్ 1 బోర్డ్ ఎగ్జామ్స్ సాధారణం కంటే కఠినంగా ఉన్నాయని విద్యార్థులు ఆందోళనకు దిగడంతో సీబీఎస్ఈ తాజా నిర్ణయం తీసుకుంది. కాగా, సీబీఎస్ఈ(CBSE) 10, 12వ తరగతిలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బోర్డ్ ఎగ్జామ్ ఉండేది. కానీ, నూతన విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి సెమిస్టర్ పద్దతిని ప్రవేశపెట్టింది. అంటే, ఏటా రెండు సార్లు టర్మ్ 1, టర్మ్ 2 పద్దతిలో ఈ పరీక్షలను (Exams) నిర్వహిస్తోంది. టర్మ్1 పరీక్షలు ఇటీవలే పూర్తయ్యాయి.
ఈ సెమిస్టర్ విధానం విద్యార్థులకు కొత్త కావడంతో అవగాహన లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు, పేపర్లు కఠినంగా ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో వారి ఆందోళనకు తలొగ్గిన సీబీఎస్ఈ ఏ విద్యార్థిని ఫెయిల్ చేయకూడదని నిర్ణయించింది. బోర్డు ప్రకారం, టర్మ్ 1 బోర్డు పరీక్ష ఫలితాల్లో మార్కులు మాత్రమే ఉంటాయి. విద్యార్థులకు పాస్, ఫెయిల్, రిపీటర్ లేదా కంపార్ట్మెంట్ గ్రేడ్లను కేటాయించదు. అయితే, టర్మ్–2 పరీక్షలు ముగిసిన తర్వాత మాత్రం పాస్ లేదా ఫెయిల్ మెరిట్ జాబితాను రిలీజ్ చేస్తుంది. టర్మ్ 1, టర్మ్ 2, ఇంటర్నల్ ఎవల్యూషన్ స్కోర్ల ఆధారంగా తుది ఫలితాన్ని ప్రకటిస్తుంది.
జనవరి చివరి నాటికి టర్మ్ 1 ఫలితాలు..
సీబీఎస్ఈ ఎగ్జామ్ కంట్రోలర్ సన్యామ్ భరద్వాజ్ మాట్లాడుతూ ‘‘బోర్డు తాజా నిర్ణయం దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు ఊరటనిచ్చింది. దీని ద్వారా పరీక్షలలో విఫలమయ్యే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతుందని భావిస్తున్నాం. ఎందుకంటే మొదటి టర్మ్ తర్వాత కేవలం మార్కులు మాత్రమే తెలియజేస్తే విద్యార్థులు తమను తాము బాగా విశ్లేషించుకోగలుగుతారు. వారు రెండవ టర్మ్కు ఎలా సిద్ధం కావాలో సులభంగా తెలుసుకుంటారు." అని పేర్కొన్నారు.
ఇప్పటికే పూర్తయిన టర్మ్ 1 పరీక్షలకు సంబంధించిన ఫలితాలు జనవరి చివరి నాటికి వెలువడే అవకాశం ఉంది. ఇక, ఇంటర్నల్ అసెస్మెంట్ మార్గదర్శకాలను కూడా సీబీఎస్ఈ అన్ని పాఠశాలలు, కాలేజీలకు అందించింది. పదో తరగతి విద్యార్థులకు ప్రాక్టికల్ పార్ట్లో మూడు పీరియాడిక్ అసెస్మెంట్లు, స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ పోర్ట్ఫోలియో, ప్రాక్టికల్ వర్క్, స్పీకింగ్ అండ్ లిజనింగ్ యాక్టివిటీల ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తారు. ఇక, 12వ తరగతి ఇంటర్నల్ ఎవల్యూషన్లో యూనిట్ టెస్ట్లు, ఎక్స్ప్లరేటరీ యాక్టివిటీస్; ప్రాక్టికల్స్ అండ్ ప్రాజెక్ట్ల ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తారు. సీబీఎస్ఈ టర్మ్–2 పరీక్షలను 2022 మార్చి నుంచి ఏప్రిల్ మధ్య నిర్వహించే అవకాశం ఉంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.