దేశంలోని ప్రతిష్టాత్మక బీ స్కూల్స్లో ఎంబీఏ(MBA) సీటు దక్కించుకునేందుకు క్యాట్ (కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఎగ్జామ్ క్రాక్ చేయాల్సి ఉంటుంది. అయితే, క్యాట్(CAT) వంటి కఠినమైన పరీక్షలో మంచి స్కోర్(Score) సాధించడం అంత సులువేమీ కాదు. దీని కోసం కఠోర శ్రమ, ప్రణాళిక బద్దమైన ప్రిపేరేషన్(Preparation) అవసరం. లక్షలాది మంది విద్యార్థులు పోటీపడితే వారిలో కొంతమందికే సీట్లు దక్కుతాయి. దీంతో సీటు రాని వారు తర్వాతి సెషన్ కోసం సిద్దమయ్యేవారు. దీని వల్ల దాదాపు ఏడాది కాలం వృధా అవుతుంది. అందుకే, క్యాట్కు ప్రత్యామ్నాయంగా 2019 ఏడాదిలో సీమ్యాట్ ఎంట్రన్స్ టెస్ట్( Entrance Test) ప్రారంభమైంది. దీంతో, క్యాట్లో మంచి స్కోర్ రాని వారు నిరాశ చెందకుండా సీమ్యాట్ ద్వారా ప్రవేశాలు పొందే అవకాశం లభిస్తుంది. అందుకే, ఎంబీఏ ప్రవేశాల కోసం క్యాట్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన ఎగ్జామ్గా సీమ్యాట్ నిలిచింది.
Jobs in Telangana: డిగ్రీ అర్హతతో తెలంగాణలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు వారం రోజులే చాన్స్!
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. తాజాగా, Shiksha.com, ఇన్ఫోఎడ్జ్ లిమిటెడ్ సంయుక్తంగా విడుదల చేసిన ఎంబీఏ అవుట్లుక్ రిపోర్ట్–2022 ఈ విషయాన్ని బయటపెట్టింది. ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ విభాగాల్లో క్యాట్ ద్వారా సీటు దక్కని విద్యార్థులు సీమ్యాట్ పరీక్షను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారని ఎంబీఏ అవుట్లుక్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం, కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ టెస్ట్ (CMAT) భారతదేశంలో మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) చదవాలనుకునే అభ్యర్థులకు రెండవ ప్రత్నామ్నాయ ప్రవేశ పరీక్షగా అవతరించింది.
ఎంబీఏ విద్యకు రెండవ ప్రత్యామ్నాయంగా సీమ్యాట్..
దక్షిణ భారతదేశం మినహా, ఇతర ప్రాంతాల్లో సీమ్యాట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది. సీమ్యాట్ అనేది దేశంలోని మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. ఈ పరీక్షను 2019 నుండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తోంది. కాగా, భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు ఎంబీఏ ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్నారు. డిగ్రీలో ఏ కోర్సు చేసినప్పటికీ ఎంబీఏ చేయగలిగే అవకాశం ఉండటంతో దీన్ని ఎంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
Jobs in NHPC: ఎన్హెచ్పీసీలో 133 ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
“ఎంబీఏ అనేది భారతీయ యువతలో అత్యంత డిమాండ్ ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో ఒకటి. గ్లోబల్ మార్కెట్లో మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లకు పెరుగుతున్న అవకాశాల దృష్ట్యా క్యాట్, సీమ్యాట్ రాసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.”అని Shiksha.com చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వివేక్ జైన్ అన్నారు. ఎంబీఏ కళాశాలను ఎంచుకునే విషయానికి వస్తే.. చాలా మంది విద్యార్థులు కోర్సు ఫీజుల కంటే రిక్రూటర్లు, ప్లేస్మెంట్ అవకాశాలను బట్టి ఆయా కళాశాలను ఎంపిక చేసుకునే ధోరణి పెరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, Mba, Students