మారుతున్న జాబ్ మార్కెట్కు (Job Market) అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు. ఈ క్రమంలోనే ప్రీమియం బిజినెస్ స్కూల్గా పేరొందిన హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ఓ కొత్త ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. డిజిటల్ మార్కెటింగ్ అనలిటిక్స్ (DMA) ప్రోగ్రామ్ నాలుగో బ్యాచ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్ను ఎమెరిటస్ ద్వారా ఆన్లైన్ విధానంలో ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సు ఫిబ్రవరి 14న ప్రారంభమవుతుంది. 12 వారాల పాటు కొనసాగుతుంది. డిజిటల్ మార్కెటింగ్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ను 5 నుంచి 15 సంవత్సరాల మధ్య పని అనుభవం గల మధ్య స్థాయి, సీనియర్ స్థాయి నిపుణుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఏదైనా స్పెషలైజేషన్లో ఎంబీఏ/పీజీడీఎం పూర్తి చేయని వారు సైతం డీఎంఏ కోర్సులో చేరవచ్చని ఐఎస్బీ ఇన్స్టిట్యూట్ పేర్కొంది.
డిజిటల్ మార్కెటింగ్ అనలిటిక్స్ (డీఎంఏ) ప్రోగ్రామ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్లోని అనేక ముఖ్యమైన అంశాలు, మాడ్యూల్స్ను నేర్చుకోవచ్చు. ఆప్టిమైజేషన్లు. రికమండేషన్స్ చేయడంలో ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇన్స్టిట్యూట్ తెలిపింది. ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసిన వారు ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ నెట్వర్క్లో భాగం అవుతారు. అంతేకాదు, ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ అలుమ్ని గ్రూప్లో చేరే అవకాశం లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్ను ఐఎస్బీ ఫ్యాకల్టీ నిర్వహిస్తున్నారు. నిపుణులైన ఫ్యాకల్టీ చేత ఆన్లైన్ క్లాసులుంటాయి. కాగా, ఐఎస్బీ 2021 ఏప్రిల్లో డిజిటల్ మార్కెటింగ్ అనలిటిక్స్ (బీఎంఏ) మొదటి బ్యాచ్ను ప్రారంభించింది. అప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం మూడు బ్యాచ్లు పూర్తయ్యాయి. ఈ మూడు బ్యాచ్ల ద్వారా 824 మంది విద్యార్థులు శిక్షణ పొందారు.
డిజిటల్ మార్కెటింగ్లో పెరుగుతున్న అవకాశాలు..
గోల్డ్మన్ సాచ్స్ నివేదిక ప్రకారం, 2025 నాటికి భారతదేశంలో డిజిటల్ మార్కెటింగ్ పరిధి USD 160 బిలియన్లను చేరుకుంటుంది. హాట్స్యూట్ 2021 ప్రకారం, 44.8 శాతం ఇంటర్నెట్ వినియోగదారులు బ్రాండ్ సమాచారం కోసం సోషల్ మీడియా వైపు మొగ్గు చూపుతున్నారు. నేటి ఆన్లైన్ వ్యాపార వాతావరణంలో డిజిటల్ మీడియా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అందుకే, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు భారీ డిమాండ్ నెలకొంది.
Microsoft Jobs: గుడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
ఈ ప్రోగ్రామ్ గురించి APAC, ఎమెరిటస్ సీఈవో మోహన్ కన్నెగల్ మాట్లాడుతూ, “గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది. సాంకేతిక ఆధారిత పురోగతితో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ను తమ బ్రాండ్ ప్రయోషన్ కోసం బాగా ఉపయోగించుకుంటున్నాయి. తద్వారా టార్గెట్ ఆడియన్స్ను సులభంగా చేరుకుంటూ మార్కెట్ను విస్తరించుకుంటున్నాయి. తద్వారా, సాంప్రదాయ మార్కెటింగ్ విధానాలకు స్వస్తి పలికి డిజిటల్ మార్కెటింగ్ వైపు కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.