సోషల్ మీడియా ట్రెండ్ ప్రారంభమైన నాటి నుంచి తప్పుడు వార్తలు సైతం పెరుగుతున్నాయి. కొందరు కావాలని అసత్యపు వార్తలను సృష్టించి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఎక్కడో జరిగిన విషయాలను ఇక్కడ జరిగాయన్నట్లు చెబుతూ ఆందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా సీఏ పరీక్షల విషయంలో ఇలాంటి తప్పుడు వార్తను కొందరు తయారు చేశారు. పరీక్ష తేదీల్లో మార్పులు అంటూ ఓ తప్పుడు ప్రకటన కాపీని సైతం సృష్టించి సోషల్ మీడియాలో ఉంచారు. దీంతో అభ్యర్థులు అది నిజమనే నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) దృష్టికి వెళ్లింది. దీంతో సంస్థ సీఏ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక సూచన చేసింది. పరీక్ష తేదీలను మార్చినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని స్పష్టం చేసింది.
అభ్యర్థులంతా ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. వివిధ సోషల్ మీడియా వేధికల్లో సీఏ పరీక్ష తేదీలు వాయిదా పడ్డాయంటూ తప్పుడు పోస్టులు వస్తున్న క్రమంలో ICAI ఈ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో సీఏ పరీక్షలపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
Rebuttal of Fake News being disseminated in Social Media-ICAI hereby advises its Students that attached Revised Schedule of ICAI Exams is false. Appropriate Action is being initiated against those spreading this info & we reiterate to follow https://t.co/G24kqWMP0e for updates. pic.twitter.com/BGC9tK3vaA
— Institute of Chartered Accountants of India - ICAI (@theicai) October 27, 2020
కొత్త షెడ్యూల్ వచ్చిందన్న వార్త పూర్తిగా అవాస్తవమని ICAI స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నెల 13న ప్రకటించిన పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. కాగా.. ICAI CA పరీక్షలు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 14 వరకు నిర్వహించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exams, Fake news, Social Media