కోవిడ్–19 ప్రభావం అన్ని రంగాలతో పోలిస్తే విద్యా రంగంపైనే ఎక్కువగా పడిందని చెప్పవచ్చు. దేశంలో మార్చి నెలలో లాక్డౌన్ ప్రారంభమవడంతో పై చదువులకు వెళ్లే వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, అన్లాక్ ప్రక్రియలో భాగంగా ఇప్పుడిప్పుడే విద్యాసంస్థలు తెరుచుకుంటున్నాయి. దీంతో విద్యార్థులు దేశవిదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య వైపు మళ్లడం లేదు. ఇటువంటి వారికి ఆర్థికపరంగా అండగా నిలుస్తూ అనేక బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను మంజూరు చేస్తున్నాయి. విద్యా రుణాలు మంజూరు చేయడంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుంది. ఈ బ్యాంకు భారతదేశంలో లేదా విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించబోయే పౌరులకు టర్మ్ లోన్లను అందిస్తోంది. ఈ విద్యార్థి రుణంతో, కోర్సు వ్యవధి పూర్తయిన తర్వాత 15 సంవత్సరాల వరకు లోన్ రీపేమెంట్ పీరియడ్ తో పాటు 12 నెలల రీమెంట్ పీరియడ్ హాలిడేను కూడా అందిస్తోంది. మీరు ఎస్బీఐ స్టూటెండ్ లోన్ స్కీంకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ విషయాలపై అవగాహన పెంచుకోండి.
కోర్సులు
భారతదేశంలో..
విదేశాల్లో..
వీటి కింద రుణం మంజూరు చేస్తారు..
ఎంత మొత్తం లోన్ మంజూరు చేస్తారంటే?
భారతదేశంలో..
వైద్య కోర్సులకు రూ .30 లక్షల వరకు మంజూరు చేస్తారు. ఇతర కోర్సులకు రూ .10 లక్షలు( కోర్సును బట్టి రూ.50 లక్షలు) వరకు రుణం మంజూరు చేస్తారు.
విదేశాలలో..
రూ .7.50 లక్షల వరకు (గ్లోబల్ ఎడ్-వాన్టేజ్ పథకం కింద విదేశాలలో చదువుకోవడానికి అధిక రుణ పరిమితి గరిష్టంగా రూ .1.50 కోట్ల వరకు) ఉంటుంది.
ప్రాసెసింగ్ ఛార్జీలు
రూ .20 లక్షల వరకు తీసుకునే విద్యా రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేయబడదు. కాగా, రూ .20 లక్షలకు పైబడిన రుణాలకు రూ .10,000 (అదనంగా పన్నులు) ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయబడుతుంది.
సెక్యూరిటీ
రూ .7.5 లక్షల వరకు తీసుకునే రుణాలపై సహ- రుణగ్రహీతగా తల్లిదండ్రులు/ సంరక్షకులు ఉంటారు. దీనికి కొలాటిరల్ సెక్యూరిటి లేదా థర్డ్ పార్టీ హామీ అవసరం లేదు. అదే విధంగా, రూ .7.5 లక్షలకు మించి తీసుకునే రుణంపై సహ -రుణగ్రహీతగా తల్లిదండ్రులు/ సంరక్షకులు కొలాటిరల్ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
మార్జిన్
రూ .4 లక్షల వరకు ఎటువంటి మార్జిన్ అవసరం లేదు. భారతదేశంలో చదువుకు గాను తీసుకునే రూ .4 లక్షలకు పైగా రుణంపై 5 శాతం, విదేశాలలో చదువుకోవడానికి తీసుకునే రూ.4 లక్షల రుణంపై 15 శాతం మార్జిన్ వర్తిస్తుంది. కోర్సు పూర్తయిన సంవత్సరం తర్వాత ఈఎంఐ చెల్లించడం ప్రారంభమవుతుంది. 15 సంవత్సరాలలో మొత్తం రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, Personal Loan, Sbi