గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ గేట్-2022 (GATE 2022)దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి సెప్టెంబర్ 24 వరకు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది గేట్ పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఖరగ్పూర్ (IIT Kharagpur) నిర్వహిస్తోంది. గేట్ ఎగ్జామ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల్లో ఎంఈ/ఎంటెక్ అడ్మిషన్లు పొందవచ్చు. అంతేకాదు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను తమ సంస్థల్లో నియమించుకుంటున్నాయి. గేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్(GOAPS) ద్వారా సెప్టెంబర్ 24లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో అక్టోబర్ 1 వరకు దరఖాస్తు ఫారం సబ్మిట్ చేయవచ్చు. ఈ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ లింక్ను వెబ్సైట్ నుంచి తొలగిస్తారు. గేట్ 2022 పరీక్ష ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 13 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అయితే దేశంలో కోవిడ్ పరిస్థితిని బట్టి ఎగ్జామ్ తేదీని మార్చే అవకాశం ఉందని ఐఐటీ ఖరగ్పూర్ వెల్లడించింది.
దీనిపై ఐఐటీ ఖరగ్పూర్ ట్వీట్ చేస్తూ ‘‘గేట్ పరీక్షలో పాల్గొనే అభ్యర్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధానమైంది. ఎగ్జామ్ తేదీ నాటికి దేశంలో కోవిడ్–19 మహమ్మారి పరిస్థితిని బట్టి ఈ వెబ్సైట్లో పేర్కొన్న ఎగ్జామ్ డేట్స్ మారవచ్చు. లేదా పరిస్థితి తీవ్రతను బట్టి రద్దు కూడా చేసే అవకాశం ఉంది” అని తెలిపింది.
అర్హత
ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్/ సైన్స్/ కామర్స్/ ఆర్ట్స్ విభాగాల్లో ఏఐసీటీఈ, యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్, బీఆర్క్, బీ ప్లానింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మూడు, నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తుకు అర్హులు. భారతదేశం కాకుండా ఇతర దేశాల్లో యూజీ కోర్సులు చేస్తున్న, పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఎటువంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
NEET 2021: నీట్ ఎగ్జామ్ వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన NTA.. వివరాలివే
ఈ సారి మార్పులివే..
గేట్–2022లో పలు మార్పులు జరిగాయి. ఈ సారి కొత్తగా నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజినీరింగ్, జియోమాటిక్స్ ఇంజినీరింగ్ అనే రెండు పేపర్లను చేర్చారు. ఈ రెండు పేపర్లతో గేట్ సబ్జెక్ట్ పేపర్ల సంఖ్య 29కి చేరింది. అభ్యర్థులు వీటిలో ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. రెండు పేపర్లకు హాజరయ్యే విధానాన్ని గేట్–2021 నుంచి అమలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exams