EXAMS MUST TO CONDUCTED FOR FINAL YEAR STUDENTS FOR UG AND PG ORDERED UGC AK GH
Exams: ఆల్ పాస్ అంటే కుదరదు.. ఆ విద్యార్థులందరికీ పరీక్షలు తప్పనిసరి.. అప్పటిలోగా నిర్వహించాలని కీలక ఆదేశాలు
ప్రతీకాత్మక చిత్రం
Final Year Students Exams: దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలకు అకడమిక్ క్యాలెండర్, ఎగ్జామినేషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. అన్ని యూనివర్సిటీలు యూజీ, పీజీ ఫైనలియర్ సెమిస్టర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని కోరింది.
కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన విద్యా రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) 2021–2022 విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలకు అకడమిక్ క్యాలెండర్, ఎగ్జామినేషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. అన్ని యూనివర్సిటీలు యూజీ, పీజీ ఫైనలియర్ సెమిస్టర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని కోరింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను బట్టి ఈ పరీక్షలను ఆన్లైన్/ బ్లెండెడ్ (ఆన్లైన్ లేదా ఆఫ్లైన్) మోడ్లో నిర్వహించుకోవచ్చని తెలిపింది. యూజీసీ ఆదేశాల మేరకు అన్ని యూనివర్సిటీలు ఆగస్టు 31లోగా ఈ టెర్మినల్ సెమిస్టర్/ ఫైనలియర్ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
అయితే ఈ నిబంధన ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వర్తించదు. ఆయా విద్యార్థులకు ఇంటర్నల్ ఎవాల్యూషన్ను బట్టి 50 శాతం, కిందటి ఏడాది మార్కులను బట్టి మరో 50 శాతం మార్కులు కేటాయించవచ్చని యూజీసీ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. స్థానికంగా ఉన్న కరోనా పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం ఇంటర్మీడియట్ పరీక్షలను ఆన్లైన్ / ఆఫ్లైన్ / బ్లెండెడ్ మోడ్లో నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్–19 సంబంధించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని కోరింది.
అక్టోబర్ 1 నుంచి కొత్త అకడమిక్ ఇయర్..
ఇక, దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో 2021–22 నూతన అకడమిక్ సెషన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుందని యూజీసీ ప్రకటించింది. కొత్త అకడమిక్ ఇయర్కు సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ సెప్టెంబర్ 30లోపు పూర్తిచేయాలని కోరింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డుల ఫలితాలు వెల్లడించిన అనంతరమే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించాలని వర్సిటీలు, కాలేజీలను ఆదేశించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎస్ఎస్ఈ బోర్డుల క్లాస్ / గ్రేడ్- XII పరీక్షల ఫలితాలన్నీ జూలై 31లోపు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ ఈ ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగితే కొత్త అకడమిక్ ఇయర్ అక్టోబర్ 18 నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. అప్పటి పరిస్థితులను బట్టి తరగతులు, పరీక్షలు ఆన్లైన్/ ఆఫ్లైన్లో దేనిలో నిర్వహించాలనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.