టీచర్ జాబ్ కోరుకునేవారికి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో టీచర్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ఏప్రిల్ 30న ముగిసింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయలేకపోయారు. అలాంటి వారికి మరో అవకాశం అందించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA. ఈ నియామక ప్రక్రియ చేపట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA దరఖాస్తు గడువును పొడిగించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2021 మే 31 లోగా దరఖాస్తు చేయొచ్చు. విద్యార్హతల్లో ఎలాంటి మార్పులు ఉండవు. దరఖాస్తు గడువు 2021 మే 31 వరకు పొడిగిస్తున్నామని, డొమిసైల్ సర్టిఫికెట్ అప్లికేషన్ సబ్మిషన్ సమయంలో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA వెల్లడించింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను https://tribal.nic.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిక్రూట్మెంట్ https://recruitment.nta.nic.in/WebinfoEMRSRecruitment/ వెబ్సైట్లో అప్లై చేయాలి.
ఇక ఈ నోటిఫికేషన్ వివరాలు చూస్తే దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో మొత్తం 3479 టీచర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ లాంటి పోస్టులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ఖాళీలున్నాయి. తెలంగాణలో 262 పోస్టులు ఉండగా అందులో ప్రిన్సిపాల్- 11, వైస్ ప్రిన్సిపాల్- 6, పీజీటీ- 77, టీజీటీ- 168 ఖాళీలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 117 పోస్టులు ఉండగా అందులో ప్రిన్సిపాల్- 14, వైస్ ప్రిన్సిపాల్- 6, టీజీటీ- 97 పోస్టులున్నాయి.
LIC Agent Jobs: ఏడాదిలో 3,45,469 ఎల్ఐసీ ఏజెంట్ల నియామకం... మీరూ దరఖాస్తు చేయండి ఇలా
IIT Jobs 2021: ఐఐటీ రూర్కీలో 139 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 3479
ప్రిన్సిపాల్- 175
వైస్ ప్రిన్సిపాల్- 116
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్- 1244
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్- 1944
దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 31
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 జూన్ 1 రాత్రి 11.50 గంటలు
అడ్మిట్ కార్డుల డౌన్లోడ్- త్వరలో వెల్లడించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
పరీక్ష తేదీ- త్వరలో వెల్లడించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
ఇంటర్వ్యూ షెడ్యూల్- త్వరలో వెల్లడించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
FSSAI Recruitment 2021: ఫుడ్ సేఫ్టీ అథారిటీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
IT Jobs: నిరుద్యోగులూ బీ రెడీ... ఇన్ఫోసిస్, టీసీఎస్లో 65,000 ఉద్యోగాలు
విద్యార్హతలు- ప్రిన్సిపాల్ పోస్టుకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. లేదా టీచింగ్లో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్గా పనిచేసిన అనుభవం ఉండాలి. టీజీటీ, పీజీటీ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి.
దరఖాస్తు ఫీజు- ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టుకు రూ.2,000. పీజీటీ, టీజీటీ పోస్టుకు రూ.1,500.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ.
ఎగ్జామ్ డ్యూరేషన్- 180 నిమిషాలు
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం 288 స్కూల్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరో 452 స్కూళ్లను ప్రారంభిస్తోంది. దీంతో మొత్తం స్కూళ్ల సంఖ్య 740 కి చేరుకోనుంది. ఇప్పటికే రాష్ట్రాల నుంచి 100 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయి. త్వరలో స్కూళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Telangana jobs, Upcoming jobs