CTET 2021 NOTIFICATION TO BE RELEASED KNOW APPLICATION DATE EVK
CTET 2021: ఈసారి సీటెట్ ఆన్లైన్ పద్ధతిలో.. సెప్టెంబర్ 20 నుంచి దరఖాస్తులు ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఏడాదికి సీటెట్ పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు సీబీఎస్సీ (CBSC) తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ (Notification) సెప్టెంబర్ 20 వస్తుందని అధికారులు తెలిపారు. దరఖాస్తులను సెప్టెంబర్ 20, 2021 నుంచి ప్రారంభిస్తున్నారు.
ఉపాధ్యాయవృత్తిని చేపట్టాలనుకునేవారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teachers Eligibility test)-CTET నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సీటెట్ పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు సీబీఎస్సీ (CBSC) తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లో సెప్టెంబర్ 20 వస్తుందని అధికారులు తెలిపారు. దరఖాస్తులను సెప్టెంబర్ 20, 2021 నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది సీటెట్ ను 16 డిసెంబర్ 2021 నుంచి13 జనవరి 2022 వరకు నిర్వహిస్తారు. పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో జరుగుతుంది. పరీక్ష(Exam), సిలబస్(Syllabus), అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం ctet.nic.in అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. ఈ పరీఓ సీబీఎస్సీ నిర్వహిస్తున్న 15వ పరీక్ష. సీటెట్ (CTET)లో ఒక పేపర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.1000 ఫీజు .. రెండు పేపర్లకు అయితే రూ.1200 చెల్లించాలి. ఎస్సీ(SC)/ఎస్టీ(ST)/పీడబ్ల్యూడీ(PWD ) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఒక పేపర్కు రూ.500 రెండు పేపర్ల(Two papers)కు రూ.600 ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ విడుదల
సెప్టెంబర్ 20, 2021
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం
సెప్టెంబర్ 20, 2021
దరఖాస్తుకు చివరి తేదీ
అక్టోబర్ 19, 2021
ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ
అక్టోబర్ 20, 2021
అడ్మిట్ కార్డుల విడుదల
డిసెంబర్ 15, 2021
పరీక్ష తేదీ
డిసెంబర్ 16, 2021 నుంచి జనవరి 13 2022 వరకు
సీటెట్ వల్ల ఉపయోగాలు..
సీటెట్లో క్వాలిఫై అయినవారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించొచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS, నవోదయ విద్యాలయ సమితి-NVS, ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-ERDO లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు.
ఎవరు రాయొచ్చు సీటెట్..
ఎగ్జామ్ పేపర్- 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల(Students)కు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్- 1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -2 రాయాలి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -1, పేపర్ 2 రాయాల్సి ఉంటుంది.
పేపర్ 1 విద్యార్హత- పేపర్ -1 రాయాలనుకునే అభ్యర్థులు 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (Diploma In Education) చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
పేపర్ 2 విద్యార్హత- డిగ్రీతో పాటు రెండేళ్లు ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. డిగ్రీతో పాటు ఏడాది బీఈడీ చదవాలి. 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.