సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కొత్త పరీక్షల విధానాన్ని తీసుకొచ్చింది. 10వ, 12వ తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షలు ఏడాదిలో రెండుసార్లు నిర్వహించే టూ ఎగ్జామ్ పాలసీని ప్రకటించింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. ప్రస్తుత 2021-22 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తేనున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఒకే సంవత్సరంలో రెండుసార్లు పరీక్షలంటే ఒత్తిడి మరింత పెరుగుతుందని, కొత్త పరీక్షల విధానం సరికాదని కొందరు విద్యార్థులు భావిస్తున్నారు. పరీక్షల ఫలితాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. కరోనా ప్రభావంతో 2020-21 విద్యాసంవత్సరంలో పరీక్షలు రద్దు చేయాల్సి రావడంతో సీబీఎస్ఈ నూతన విధానానికి రూపకల్పన చేసింది. కొత్త పాలసీ కింద 10, 12వ తరగతులకు బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించనుంది.
JEE Main 2021 Exam Date: జేఈఈ మెయిన్ విద్యార్థులకు అలర్ట్... పరీక్ష తేదీలు ప్రకటించిన కేంద్ర మంత్రి
“రెండు పరీక్షలకు సంబంధించి సిలబస్ను విభజిస్తాం. ఈ వివరాలను ఈ ఏడాది జూలై నాటికి అన్ని స్కూల్స్కు తెలియజేస్తాం. బోర్డు పరీక్షల పేపర్ విధానం మారుతుంది. అబ్జెక్టివ్ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్లను తగ్గిస్తాం” అని సీబీఎస్ఈ ప్రకటించింది.
పరీక్షలెప్పుడు..?
2021-22 విద్యాసంవత్సరంలో రెండుసార్లు నిర్వహించాలనుకున్న పరీక్షల షెడ్యూల్ను సీబీఎస్ఈ ఇంకా ప్రకటించలేదు. అయితే కరోనా వైరస్ అదుపులో ఉంటే ఏ నెలల్లో నిర్వహించాలనేది నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మొదటి టర్మ్ పరీక్షలు 2021 నవంబర్-డిసెంబర్లో, రెండో టర్మ్ పరీక్షలు 2022 మార్చి- ఏప్రిల్లో జరుగుతాయి. దేశంలోని, విదేశాల్లోని అన్ని సీబీఎస్ఈ స్కూళ్లకు ఇది వర్తిస్తుంది. రానున్న విద్యా సంవత్సరంలో ప్రతీ బోర్డు ఎగ్జామ్లో 50 శాతం సిలబస్పై ప్రశ్నలు ఉంటాయని సీబీఎస్ఈ చెప్పింది. త్వరలోనే ఇందుకు సంబంధించి సిలబస్ను రెండు పరీక్షల కోసం విభజిస్తామని చెప్పింది.
“మొదటి టర్మ్ పరీక్షల్లో ఒక్కో టెస్టుకు విద్యార్థులకు 90 నిమిషాల సమయం ఉంటుంది. అన్ని సూళ్లకు క్వశ్చన్ పేపర్లు, మార్కుల విధానాన్ని సీబీఎస్ఈ పంపుతుంది. ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు కూడా ఉంటాయి” అని సీబీఎస్ఈ అకడమిక్ డైరెక్టర్ జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ తెలిపారు. ఎక్స్టర్నల్ సూపరింటెండెంట్లు, సీబీఎస్ఈ నియమించే అబ్జర్వర్ల సమక్షంలో పరీక్షలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. రెండో టర్మ్ పరీక్షలు కూడా విభజించిన సిలబస్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు. కొత్త పరీక్షల విధానాన్ని ప్రకటించే ముందు ప్రభుత్వం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సంప్రదించినట్టు సీబీఎస్ఈ చెప్పింది. అలాగే కరోనా పరిస్థితులను, ఆఫ్లైన్ టీచింగ్ కొరతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE, CBSE Board Exams 2021, Exams