కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులకు ఉచితంగా లెర్నింగ్ సొల్యూషన్స్ అందించేందుకు ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ ముందడుగేసింది. దేశీయంగా పాఠశాలల్లో ఆన్లైన్ విద్యాభ్యాసానికి తోడ్పడేలా అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్తో బైజూస్ చేతులు కలిపింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆన్లైన్ విద్యలో తోడ్పడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందం కింద ‘గూగుల్ వర్క్స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్’తో బైజూస్ స్టూడెంట్ పోర్టల్ను అనుసంధానిస్తారు. ఈ ప్రోగ్రామ్లో నమోదు చేసుకున్న విద్యాసంస్థలకు ఉచితంగానే ఆన్లైన్ కోర్సులు అందిస్తారు. తద్వారా మ్యాథ్స్, సైన్స్ బోధనకు నేరుగా యాక్సెస్ లభిస్తుంది.
అధ్యాయాల వారీగా స్లైడ్స్, రెడీమేడ్ అసైన్మెంట్స్, డేటా బ్యాంక్లు, సమ్మరీ డాక్యుమెంట్లు, హ్యాండవుట్స్, టెస్ట్స్ ఇలా మరెన్నో టాస్క్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. గూగుల్తో ఒప్పందంపై బైజూస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మృణాల్ మోహిత్ మాట్లాడుతూ.. "గతేడాది నుంచి ఆన్లైన్ విద్యాభ్యాసం గణనీయ పెరుగుదలను చూస్తోంది. కరోనా కారణంగా అంతా ఆన్లైన్ లెర్నింగ్ బాట పట్టాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెరుగైన ఈ–లెర్నింగ్ సేవలందించేందుకు గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నాం. అంతర్జాతీయ టెక్ దిగ్గజంతో కలిసి పనిచేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఆన్లైన్ లెర్నింగ్తో విద్యార్థులకు మరింత చేరువ కావడం, డిజిటల్ విప్లవానికి తొడ్పాటు అందించడమే మా ముందున్న ప్రధాన లక్ష్యాలు’ అని చెప్పారు.
Realme Anniversary Sale: రియల్మీ సేల్లో ఈ 28 స్మార్ట్ఫోన్లపై ఆఫర్స్
Realme X7 Max 5G: కాసేపట్లో రియల్మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ సేల్... ఆఫర్ వివరాలు ఇవే
సౌకర్యవంతమైన ఆన్లైన్ లెర్నింగ్కు తోడ్పాటు అందించేలా బైజూస్ గుగుల్తో ఒప్పందం చేసుకుంది. ‘గూగుల్ వర్క్స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్’ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఉపాధ్యాలయులకు సరళత్వాన్ని, భద్రతను అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్లో భాగంగా ఉపాధ్యాయులు గూగుల్ మీట్ యాక్సెస్ పొందగలుగుతారు. ఒకేసారి 100 మంది విద్యార్థులు ఉచితంగా ఈ క్లాసులను యాక్సెస్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
దీనిపై గూగుల్ ఎడ్యుకేషన్ దక్షిణాసియా హెచ్ బాని ధావన్ మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా విద్యార్థులను చేరుకునేందుకు బైజూస్తో భాగస్వామ్యం కావడం మాకెంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలోనే అందుబాటులో ఉన్న మా ఇంటరాక్టివ్ సెషన్స్ను ఇతర అన్ని భారతీయ భాషల్లో కూడా అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెరుగైన ఈ–లెర్నింగ్ సౌకర్యాన్ని అందించడమే మా లక్ష్యం.” అని అన్నారు. కాగా, బైజూస్ ప్లాట్ఫామ్లో ప్రపంచవ్యాప్తంగా 95 మిలియన్ల మంది విద్యార్థులు నమోదయ్యారు. దీంతో ప్రపంచపు అగ్రగామి ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థగా బైజూస్ కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Online classes, Online Education