కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి ఆన్లైన్ క్లాసులకు(Online Class) ప్రాధాన్యత పెరిగింది. దీంతో అనేక ఇన్స్టిట్యూట్స్(Institutes) ఆన్లైన్లో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సులకు ఇటీవల కాలంలో డిమాండ్ బాగా పెరిగింది. దీంతో అన్ని సంస్థలు ఇదే బాటపడుతున్నాయి. తాజాగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ - పిలానీ (BITS-Pilani) ఆన్లైన్ మోడ్లో బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కోర్సును ప్రారంభించింది. ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ కోర్సెరా ద్వారా ఈ కోర్సును అందించనున్నారు. ఈ ఆన్లైన్ కోర్సు సంవత్సరానికి రెండు సార్లు జులై, నవంబర్లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నవంబర్ కోహోర్ట్ (బ్యాచ్) కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ముందస్తు దరఖాస్తు గడువు అక్టోబరు 17 కాగా, తుది గడువు నవంబర్ 15గా నిర్ణయించారు. తరగతులు నవంబర్ 30న ప్రారంభమవుతాయి. కోర్సు కాలవ్యవధి మూడేళ్లు అయితే, డిగ్రీ(Degree) పూర్తి చేయడానికి కేటాయించిన గరిష్ట సమయం ఆరు సంవత్సరాలు. ఈలోపు కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.
అర్హతలు:
ఏదైనా స్ట్రీమ్లో 12వ తరగతి పాసైన విద్యార్థులు కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే కాలేజీల్లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా కోర్సు కోసం అప్లై చేసుకోవచ్చు.
India Post Recruitment 2022: టెన్త్ అర్హతతో ఇండియా పోస్ట్లో జాబ్స్ .. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి
వర్క్ప్లేస్ స్కిల్స్ కూడా..
ఇదే విధమైన కోర్సును ఐఐటీ మద్రాస్ అందిస్తోందని, అయితే తాము కోర్సులో భాగంగా కేవలం డేటా సైన్స్ కాకుండా కంప్యూటర్ సైన్స్ కింద అనేక రకాల సబ్జెక్టుల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తామని బిట్స్ పిలాని పేర్కొంది. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు మెషిన్ లెర్నింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, హ్యూమన్-కంప్యూటర్ ఇంటరాక్షన్, వెబ్/యాప్ డెవలప్మెంట్తోపాటు లీడర్షిప్, ప్రాబ్లమ్ - సాల్వింగ్, కమ్యూనికేషన్ వంటి వర్క్ప్లేస్ స్కిల్స్లో డిమాండ్కు తగ్గట్టుగా ఎక్స్ పీరియన్స్ పొందనున్నారని బిట్స్ పిలాని పేర్కొంది.
ఎగ్జిట్ ఆప్షన్..
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ప్రకారం.. ఈ కోర్సులో ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంది. కోర్సులో రెండేళ్ల తర్వాత డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు డిప్లొమాకు అర్హులు.
ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల విద్యార్థులు..
ఎడ్యుకేషన్ రంగంలో అంతర్జాతీయ వేదికపై స్థానం సుస్థిరం చేసుకునేందుకు బిట్స్ ఫిలాని.. విదేశీ విద్యార్థులను సైతం ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా నాణ్యమైన విద్య ఇంకా అందుబాటులో లేని అల్ప ఆదాయ దేశాల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. కోర్సెరా ద్వారా కోర్సులను ఆఫర్ చేస్తున్న భారతీయ యూనివర్సిటీల్లో ప్రపంచవ్యాప్తంగా 45 విభిన్న దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని కోర్సెరా సంస్థ పేర్కొంది.
కోర్సు ఫీజు వివరాలు
బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలంటే భారతీయ విద్యార్థులు 4000 యూఎస్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.3.1లక్షలు) ఫీజుగా చెల్లించాలి. ఇక విదేశీ విద్యార్థులు 6,000 యూఎస్ డాలర్లు చెల్లించాలి. ప్రస్తుతానికి బిట్స్ పిలాని ఫీజులో ఎటువంటి మినహాయింపు ఇవ్వడం లేదు. అలాగే ఎలాంటి స్కాలర్షిప్లను అందించడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Computer science, JOBS, New course