కరోనా కారణంగా చాలా మంద విద్యార్థులు ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆర్థిక చేయూత నిచ్చేందుకు పలు స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో విద్యార్థుల చదువు ఆటంకం కలుగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి మంచి స్కాలర్షిప్ (Scholarship) ప్రొగ్రాంలు విద్యార్థుల కెరీర్కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే కొంత ఫీజుతో కొంత కోర్సు లేదా ప్రోగ్రామ్ (Program) ని అభ్యసించడానికి వీలు కల్పిస్తుంది. కోవిడ్ కారణంగా ఎంతో మంది తల్లిదండ్రులను కోల్పోయారు. కుటుంబం పెద్ద ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఇబ్బంది పడే వారు దరఖాస్తు చేసుకోవాల్సిన స్కాలర్షిప్ వివరాలు తెలుసుకోండి.
బీవైపీఎస్ సశక్త్ స్కాలర్షిప్..
బీఎస్ఈఎస్ యమునా పవర్లిమిటెడ్ (BSES Yamuna Power Limited) ఢిల్లీలోని ప్రభుత్వ సంస్థల్లో అండర్ గ్రాడ్యయేట్ ప్రోగ్రామ్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల నుంచి స్కాలర్షిప్ పొందాలనుకొనే వారి నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ స్కాలర్షిప్ ద్వారా ఎక్కువగా వెనుకబడిన వర్గాల వారికి లబ్ధి చేకూకుతుందని సంస్థ పేర్కొంది.
అర్హతలు..
- కేవలం భారతీయ విద్యార్థులకు మాత్రమే.. ఢిల్లీలో నివసిస్తూ ఉండాలి.
- అండర్ గ్రాడ్యుయేట్లో చివరి సంవత్సరం చదువుతున్న వారికి మాత్రమే.
- ముందు విద్యా సంవత్సరంలో 55శాతం మార్కులు పొంది ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం రూ.6లక్షలు మించి ఉండకూడదు.
- ప్రైజ్లు రివార్డులు రూ.3లక్షల వరకు ఉండవచ్చు.
దరఖాస్తు చేసే విధానం..
Step 1 : ఈ స్కాలర్షిప్కు కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
Step 2 : ముందుగా https://www.buddy4study.com/scholarships వెబ్సైట్ను సందర్శించాలి.
Step 3 : రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తరువాత హెచ్డీఎఫ్సీ పరివర్తన్ కోవిడ్ కోర్సుల లింక్లోకి వెళ్లాలి.
Step 4 : హెచ్డీఎఫ్సీ పరివర్తన్ కోవిడ్ కోర్సు లింక్
https://www.buddy4study.com/page/bypl-sashakt-scholarship
Step 5 : దరఖాస్తు ఫాం పూర్తిగా నింపాలి.
Step 6 : స్టార్ట్ బటన్ నొక్కడం ద్వారా అప్లికేషన్ ఫాంలో అడిగిన వివరాలు అందించాలి.
Step 7 : అవసరమైన డాక్యుమెంట్లు పూర్తిగా అందించాలి.
ఎన్ఎస్పీ సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్..
పన్నెండో తరగతి పూర్తి చేసుకొన్న విద్యార్థులకు ఎన్ఎస్పీ సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్ (NSP Central Sector Scheme of Scholarship) చక్కని అవకాశం కల్పిస్తోంది. విద్యార్థులు పన్నెండో తరగతి పూర్తి చేసుకొని మంచి మార్కులు సాధించి ఆర్థికంగా చదవలేని స్థితిలో ఉన్నవారు ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు..
- 12వ తరగతిలో 80శాతం మార్కులుసాధించి ఉండాలి.
- అభ్యర్థులు AICTE, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI), మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) లేదా ఇతర గుర్తింపు పొందిన సంస్థల కళాశాలలో కోర్సును అభ్యసిస్తూ ఉండాలి.
- ఇతర స్కాలర్షిప్లు పొందే వారు అర్హులు కారు.
- కుటంబ ఆదాయం రూ.8లక్షలు మించి ఉండకూడదు.
- అవార్డులు,రివార్డులు సంవత్సరానికి రూ.10,000ల నుంచి రూ.20,000 వరకు ఉండొచ్చు.
దరఖాస్తు విధానం. .
Step 1 : దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది.
Step 2 : ముందుగా అభ్యర్థి అధికారిక లింక్ https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction ను సందర్శించాలి.
Step 3 : పూర్తి వివరాలు చదివి స్కాలర్షిప్ కోసం Register చేసుకోవాలి.
Step 4 : దరఖాస్తుకు నవంబర్ 30, 2021 వరకు అవకాశం ఉంది.
టాటా క్యాపిటల్ పంఖ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్
ఈ స్కాలర్షిప్కు ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హలు. అంతే కాకుండా అండ్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేవారు కూడా అర్హులు. వారు ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు..
- ఇది భారతీయులకు మాత్రమే వర్తించే స్కాలర్షిప్
- రో తరగతి నుంచి 12వ తరగతి చదివేవారు, పాల్టెక్నిక్, డిప్లమా, అండర్గ్రాడ్యుయేట్లు అప్లె చేసుకోవచ్చు.
- అకాడమిక్లో 60శాతం మార్కులు వచ్చి ఉండాలి.
- కుటంబ వార్షిక ఆదాయం రూ.4లక్షలు మించి ఉండకూడదు.
- కోవిడ్ 19 ఏ రకంగా ఇబ్బంది పడ్డ అందుకు తగిన ధ్రువపత్రాలు సమర్పించాలి.
- పరీక్ష ఫీజులో, ట్యూషన్ఫీజులో 80శాతం వరకు స్కాలర్షిప్ భరిస్తుంది.
TCS iON : గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. టీసీఎస్ ఐఓన్ 15 రోజుల ఉచిత కోర్సు
Step 1 : ఈ స్కాలర్షిప్కు కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
Step 2 : ముందుగా https://www.buddy4study.com/scholarships వెబ్సైట్ను సందర్శించాలి.
Step 3 : రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తరువాత హెచ్డీఎఫ్సీ పరివర్తన్ కోవిడ్ కోర్సుల లింక్లోకి వెళ్లాలి.
Step 4 : హెచ్డీఎఫ్సీ పరివర్తన్ కోవిడ్ కోర్సు లింక్
https://www.buddy4study.com/page/the-tata-capital-pankh-scholarship-programme
Step 5 : దరఖాస్తు ఫాం పూర్తిగా నింపాలి.
Step 6 : స్టార్ట్ బటన్ నొక్కడం ద్వారా అప్లికేషన్ ఫాంలో అడిగిన వివరాలు అందించాలి.
Step 7 : అవసరమైన డాక్యుమెంట్లు పూర్తిగా అందించాలి.
Step 8 : దరఖాస్తుకు చేసుకొనేందుకు అక్టోబర్ 15, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid -19 pandemic, EDUCATION, Scholarships, Students, Tata Group