Murali Krishna, News18, Kurnool
అనంతపురం జిల్లా (Anantapuram District) లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC & SEEDAP) ఆధ్వర్యంలో మరో జాబ్ మేళా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 6వ తేదీ ఉదయం ఉదయం 09:00 గంటల నుండి కల్యాణదుర్గంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమామొదలగు అన్ని రకాల విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ మేళాకు హాజరు కావచ్చని తెలిపారు. జాబ్ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు తమ కంపెనీలకు ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వంతో అవగాహన ఏర్పరచుకొని ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయని తెలిపారు.ఎంపికయిన అభ్యర్థులకు ఉద్యోగస్థాయిని బట్టి జీతం రూ.10,000 వేల నుంచి 30 వేల రూపాయలు వరకు ఉంటుందని తెలిపారు.
1. సంస్థ పేరు :- TATA AIG & PAISABAZAR
ఉద్యోగం :- సిఎస్ఈ
విద్యార్హత :- ఇంటర్ ఆపై విద్యార్హత
ఉద్యోగం చేయవలసిన ప్రదేశం :- హైదరాబాద్ / బెంగళూరు
జెండర్ :- M/F
వయస్సు :-19-28 సంవత్సరాలు
ఖాళీల సంఖ్య :- 100
వేతనం :- నెలకు 13,000 వేల రూపాయలు నుంచి 20,000 వరకు
2. సంస్థ పేరు :- KIA MOTOR'S
ఉద్యోగ పాత్ర :- నిమ్ ట్రైనింగ్
విద్యార్హత :- డిప్లొమా /బి. టెక్ ( 2016/2022 )
జెండర్ :- M
వయస్సు :-18 - 25 సంవత్సరాలు
ఖాళీల సంఖ్య :- 100
వేతనం :- నెలకు 16,000
ఉద్యోగం చేయవలసిన ప్రదేశం :- పెనుకొండ, అనంతపురం
ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెస్యూమ్, జిరాక్స్ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఫార్మల్ డ్రెస్లో రావాల్సి ఉంటుంది. జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలియజేశారు.
ఉద్యోగం మేళా జరుగు ప్రదేశం:-
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు :-
1.8247885109
2.9550837679
3.7880202003
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, APSSDC, Kurnool, Local News