ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా కీలక ప్రకటన చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023 (PGCET-2023) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పరీక్షలను జూన్ 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspx ను సందర్శించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, JOBS