హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

APPSC Notifications: ఏపీలో ఉద్యోగాల జాతర.. వచ్చే నెలలో గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు.. మరో 13 నోటిఫికేషన్లు కూడా..

APPSC Notifications: ఏపీలో ఉద్యోగాల జాతర.. వచ్చే నెలలో గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు.. మరో 13 నోటిఫికేషన్లు కూడా..

గౌతమ్ సవాంగ్ (ఫైల్)

గౌతమ్ సవాంగ్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (APPSC) గౌతమ్ సవాంగ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే నెలలోనే గ్రూప్-1, గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (APPSC) గౌతమ్ సవాంగ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే నెలలో 110 గ్రూప్-1, 182 గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇంకా.. ఈ నెల 24న దేవాదాయశాఖకు సంబంధించి ఈవో పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. 31న రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షను నిర్వహించనున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరో 13నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. తద్వారా మరో రెండు వేల ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ రోజు గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పై కీలక ప్రకటనలు చేశారు. ఇంటర్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ విడుదల చేశారు.

అభ్యర్థులు తమ ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/లో చూడొచ్చు. వాస్తవానికి ఇందుకు సంబంధించిన నియామక ప్రక్రియ 2018లో ప్రారంభమైంది. కానీ వివిధ కారణాలతో నియామక ప్రక్రియ ఆలస్యం అవుతూ వచ్చింది. చివరికి ఈ రోజు ఫలితాలను విడుదల చేసింది ఏపీపీఎస్సీ. మొత్తం 167 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి 2018లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం 67 మంది మహిళలు, 96 మంది పురుషులు వివిధ పోస్టులకు ఎంపికైనట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

AP Jobs 2022: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

' isDesktop="true" id="1358680" youtubeid="takIsd90ehY" category="jobs">

ఫలితాల విడుదల సందర్భంగా గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ఏపీలో గ్రూప్ 1 అభ్యర్థులు 2018 నుంచి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. 2020వ సంవత్సరం డిసెంబర్ నెలలో నిర్వహించిన మెయిన్స్ ఎగ్జామ్ కు 9,679 మంది అభ్యర్థులు పాల్గొన్నారన్నారు. అయితే.. వాల్యుయేషన్ ను డిజిటల్ విధానంలో నిర్వహించి గతేడాది ఏప్రిల్ నెలలో ఫలితాలను విడుదల చేసినట్లు వివరించారు గౌతమ్ సవాంగ్. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ గా వాల్యుయేషన్ చేశామన్నారు. అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇంటర్వ్యూల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసినట్లు చెప్పారు. హైకోర్టు ఇచ్చిన ప్రతీ ఆదేశాన్ని ఏపీపీఎస్సీ అమలు చేసిందన్నారు గౌతమ్ సవాంగ్.

First published:

Tags: Andhra Pradesh Government Jobs, APPSC, Job notification, JOBS

ఉత్తమ కథలు