కరోనా (Corona) నేపథ్యంలో గత రెండేళ్లుగా విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఎప్పుడు స్కూళ్లకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో? ఎప్పుడు ఏ ఎగ్జామ్ (Exams) రద్దు అవుతుందో తెలియని దుస్థితి. ఈ నేపథ్యంలో పలు పరీక్షలను ఆయా ప్రభుత్వాలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, పరీక్షలను నిర్వహించకుండా పాస్ చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తే భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టెన్త్, ఇంటర్ అర్హతతో నిర్వహించే అనేక నియామకాలకు ఆయా విద్యార్థులు అర్హతలు కోల్పోతారని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా ఎగ్జామ్స్ నిర్వహించాలని ఆయా ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ సమయంలోనూ స్కూళ్లను నిర్వహించాయి. సిలబస్ ను సకాలంలో పూర్తి చేసి ఎగ్జామ్స్ నిర్వహించాలని భావిస్తున్నాయి. తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ (Telangana Inter Exams) కు సంబంధించి తేదీలను కూడా అధికారులు తాజాగా విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ను తప్పనిసరిగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కాలేజీలను నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. రానున్న రోజులలో పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు ముందు వరుసలో ఉండేలా సీఎం జగన్ నూతన విద్యావిధానానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. Telangana Inter Exams: ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే
ఇంకా స్కూళ్లు మూతపడుతాయంటూ వస్తున్న ప్రచారంపై సైతం మంత్రి స్పందించారు. రానున్న రోజుల్లో ఒక్క స్కూల్ కూడా మూతపడదని మంత్రి స్పష్టం చేశారు. ఒక్క టీచర్ ఉద్యోగం కూడా పోదని మంత్రి భరోసానిచ్చారు. రానున్న రోజుల్లో ప్రతీ మండలానికి 2 లేదా 3 జూనియర్ కాలేజీలను మంజూరు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.