హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. 4 శాతం డీఏ పెంచే అవకాశం.. ఎప్పటినుంచంటే?

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. 4 శాతం డీఏ పెంచే అవకాశం.. ఎప్పటినుంచంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్​దారులకు కేంద్రం త్వరలో గుడ్ న్యూస్ రానుంది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు జూన్​ 1న ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్​దారుల ఎదురుచూపులు ఫలించేలా కన్పిస్తున్నాయి. కరోనా విజృంభన కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు జూన్​ 1న ప్రకటించే అవకాశం ఉంది. 7వ వేతన సవరణ సంఘం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తమ నివేదికను అందించింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (జెసిఎం) స్టాఫ్ సైడ్ ప్రకారం, వచ్చే నెల నుంచి డీఏ అమలు కానుందని తెలుస్తోంది. ఈసారి డిఎ పెంపు కనీసం 4 శాతం వరకు ఉంటుందని జెసిఎం అంచనా వేసింది. దీనిపై జేసీఎం ఉద్యోగుల విభాగం కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ ‘‘డీఏ పెంపు అంశంపై మేము ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డీఓపీటీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము. దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ ప్రభావం వల్ల ఏప్రిల్​ తొలి వారంలోనే ప్రకటించాల్సిన డీఏ పెంపుదలను తొలుత మే, ఆ తర్వాత జూన్​కు వాయిదా వేసినట్లు అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే, ఈ సారి వాయిదా పడకపోవచ్చని వారు తెలిపారు.

Andhra Pradesh Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఈ రోజే లాస్ట్ డేట్.. వివరాలివే..

Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. మళ్లీ నిరాశే.. పూర్తి వివరాలివే..

డియర్​నెస్​ అలవెన్స్​, డియర్​నెస్​ రిలీఫ్​ను ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జాప్యం చేసింది. మరోసారి ఈ జాప్యం ఉండబోదని మేం ఆశిస్తున్నాం.” అని ఆయన వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జూన్​ లేదా జులై నెలల్లో డీఏ పెంచుతామని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే రాజ్యసభలో హామీ సైతం ఇచ్చిన సంగతిని మిశ్రా గుర్తు చేశారు. అయితే, 2021 జనవరి 1 నుంచి డీఏ పెంపు ప్రకటించినప్పటికీ, జూలై 1 నుండి మాత్రమే ఇది పునరుద్ధరించబడుతుంది.

4 శాతం పెరగనుందా?

గత ఏడాది జులై నుంచి డిసెంబర్​ మధ్య కాలంలో ద్రవ్యోల్భనం 3.5 శాతంగా నమోదైందని, దీన్ని ఆధారంగా చేసుకుంటే.. ఉద్యోగి బేసిక్​ వేతనంలో డీఏ పెంపు కనీసం నాలుగు శాతంగా ఉండవచ్చని తాము అంచనా వేస్తున్నట్లు శివ గోపాల్​ మిశ్రా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం ఇప్పటికీ మూడు డీఏ బకాయిలను చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ బకాయిలను ఏక మొత్తంలో అందరికీ విడుదల చేయలేకపోతే.. కనీసం విడతల వారీగానైనా చెల్లించాలని తాము ఇదివరకే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. కాగా, కరోనా వల్ల ఆపేసిన డీఏ బకాయిలతో పాటు కొత్త డీఏ అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు మరింత పెరగనున్నాయి.

First published:

Tags: 7th Pay Commission, Central govt employees, Centre government

ఉత్తమ కథలు